Home » Case
‘‘నేను ఇప్పట్లో భారత్కు రాలేను. వీడియో లేదా టెలికాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరవ్వగలను’’ అని ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్, ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్రావు స్పష్టం చేశారు.
కొద్దికాలం క్రితం పార్లమెంటు సభ్యత్వం కోల్పోయి తిరిగి 2024 ఎన్నికల్లో పార్లమెంటు సభ్యురాలిగా ఎన్నికైన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా మరోసారి చిక్కుల్లో పడ్డాడు. జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ చైర్పర్సన్ రేశా శర్మపై ఆమె ఇటీవల చేసిన తీవ్ర వ్యాఖ్యలపై ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
నంద్యాల జిల్లా: ఆళ్లగడ్డలో టీడీపీ నేత ఏవీ శ్రీదేవి హత్య కేసులో 6గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 25న పాతూరు వీధిలో శ్రీదేవి హత్య జరిగింది. దీంతో ఆళ్లగడ్డలో ఒక్కసారిగా అలజడి రేగింది. ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. శ్రీదేవి హత్య తర్వాత నిందితులు పరారయ్యారు.
Teangana: హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేయడంపై మాజీ మంత్రి హరీష్ స్పందించారు. ఎమ్మెల్యేపై క్రిమినల్ కేసు తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ట్విట్టర్ వేదికగా హరీష్ స్పందిస్తూ... ‘‘ప్రజల సమస్యలను జెడ్పీ సమావేశం దృష్టికి తీసుకురావడమే కౌశిక్ రెడ్డి చేసిన తప్పా.?’’...
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త నేర న్యాయ చట్టం కింద రాష్ట్రంలో తొలి కేసు హైదరాబాద్ చార్మినార్ పోలీస్ స్టేషన్లో నమోదైంది. నంబరు ప్లేట్ లేకుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారుపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 281, మోటారు వెహికల్ చట్టం కింద కేసు పెట్టారు.
ఢిల్లీ మద్యం విధానం కుంభకోణంలో అరెస్టయి తిహాడ్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి చుక్కెదురైంది. ఈడీ, సీబీఐ కేసులకు సంబందించి ఆమె పెట్టుకున్న బెయిల్ పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. మహిళ అనే కారణంతో కవితపై సానుభూతి చూపలేమని కోర్టు స్పష్టం చేసింది.
తనపై తప్పుడు ఆరోపణలు చేసిన భార్యపై అవసరమైతే కేసు పెట్టుకోవచ్చని ఓ భర్తకు కర్ణాటక హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఐపీసీలోని సెక్షన్ 211 ప్రకారం కేసు పెట్టవచ్చని తెలిపింది.
విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ మదర్సాలో ఫుడ్ పాయిజన్ జరిగడంతో పలువురు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నిన్న రాత్రి భోజనం చేసిన పిల్లల్లో 10 మందికి వాంతులయ్యాయి.
పల్నాడు జిల్లా: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మరో కేసు నమోదైంది. తెలుగు యువత పల్నాడు జిల్లా కార్యదర్శి కొమర శివపై పిన్నెల్లి మాచర్ల కోర్టు వద్ద పిడికిలితో కడుపులో గుద్ది దాడి చేశారని పేర్కొంటూ శివ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు అధికారులకు కోర్టులో చుక్కెదురైంది. సంచలనం సృష్టించిన ఈ కేసులో ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తుపై అధికారులు ఇటీవల నాంపల్లి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఆ అభియోగపత్రాలను పరిశీలించిన న్యాయమూర్తి అందులో వివరాలు, సమర్పించిన ఆధారాలు సమగ్రంగా లేవని పేర్కొంటూ..