Home » KonaSeema
పి.గన్నవరం, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): ఎస్ఎస్ ఫిట్నెస్ జోన్ ఐదవ వార్షికోత్సవం పుర స్కరించుకుని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పోతవరంలో యునైటెట్ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి జిల్లాల పవర్ లిఫ్టింగ్ అండ్ బెంజ్ ప్రెస్-2025 పోటీలు జరిగాయి. కోనసీమ పవర్ లిప్టింగ్ అసోసియేషన్ అండ్ ఎస్ఎస్ ఫిట్నెస్ జోన్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన పోటీలను శనివారం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ నిత్యం వ్యాయమం వల్ల మానసిక ఉల్లాసంతో పాటు ఆరోగ్యవంతంగా జీవించవచ్చన్నారు. పోటీలకు ఆధ్వర్యం వహించిన ఎస్ఎస్ ఫిట్నెస్ జోన్ నిర్వహకులు కత్తుల శ్రీనివాస్ను అభినందించా రు.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా మల్కిపురం మండలం కేశనపల్లి-గొల్లపాలెం మధ్య ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓఎన్జీసీ గ్యాస్ గ్యాథరింగ్ స్టేషన్లో లీకేజీ జరిగి సిబ్బంది అస్వస్థతకు గురయ్యారు.
అంతర్వేది, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఏర్పాటుచేసిన అమృత్ మహోత్సవ్ సౌత్ ఇండియాలో భాగంగా ఆం ధ్రప్రదేశ్ తరపున కోనసీమ జి
ముమ్మిడివరం, మార్చి 8 (ఆం ధ్రజ్యోతి): మహిళా దినోత్సవం రోజున ఓ యువతిపై యువకుడు కత్తితో దాడి చేసి మెడపై నరికిన సంఘటన ముమ్మిడివరం మండలం అనాతవరంలో జరిగింది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం అనాతవరం ఎదురుమూడి పుంతలో పంతగంటి
కుంభమేళాలో పూసలు అమ్మే మహిళను వీడియో తీసి.. మోనాలిసా అంటూ ప్రచారం చేయడంతో ఆమె పాపులర్ అయిపోయింది.
ఉప్పలగుప్తం/అమలాపురం టౌన్, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా చల్లపల్లి పంచాయతీ పరిధిలోని జగ్గరాజుపేట ప్రాథమిక పాఠశాలలో కలుషిత ఆహారం తిని 14 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం ఉదయం 10.30 గంటలకు మఽధ్యాహ్న భోజన పథక నిర్వాహకురాలు పులిదిండి సుజాత అందజేసిన రాగిజావను తాగిన విద్యార్థులు తొలుత స్వల్పంగా అస్వస్థతకు గురయ్యారు. అనంతరం 12.10 గంటలకు
అమలాపురం డంపింగ్ యార్డులో చెత్తను తగలబెట్టడం వల్ల విడుదలవుతున్న పొగతో ప్రజారోగ్యం దెబ్బతింటుందని, చెత్త వేయడాన్ని నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం ఉదయం డంపింగ్ యార్డు ముఖద్వారం వద్ద పరిసర ప్రాంతాల వార్డు ప్రజలు టెంట్ వేసి ధర్నా చేపట్టారు.
బాలికలను రక్షించి బాలికా విద్యను ప్రోత్సహించడంతో పాటు లింగ వివక్షను రూపుమాపేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న భేటీ బచావో.. భేటీ పడావో కార్యక్రమం ఆశించిన సత్ఫలితాలు అందిస్తుందని జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి చెప్పారు. భేటీ బచావో.. భేటీ పడావో కార్యక్రమం ప్రారంభించి పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్శంగా మహిళా సంక్షేమశాఖ, మహిళా పోలీసు సిబ్బందితో చేపట్టిన బైక్ ర్యాలీని కలెక్టరేట్ వద్ద శనివారం జేసీ నిషాంతి ప్రారంభించారు.
కోటిపల్లి పుణ్యక్షేత్రంలో ఈనెల 25 నుంచి 27 వరకూ నిర్వహించే శివరాత్రి ఉత్సవాలను, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని ఉత్సవ కమిటీ చైర్మన్, రామచంద్రపురం ఆర్డీవో డి.అఖిల అన్నారు.
మహాత్మా జ్యోతిబా ఫూలే ఏపీ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో 5వ తరగతి ప్రవేశాలకు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసినట్టు జిల్లా కన్వీనర్, బీసీ సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వైటీఎస్ రాజు తెలిపారు.