Home » Mahesh Kumar Goud
కాంగ్రెస్ తల్లి, రాహుల్ గాంధీ తండ్రి విగ్రహాలను ప్యాక్ చేస్తామంటూ కేటీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నారని, దమ్ముంటే విగ్రహాలపై చెయ్యేసి చూడాలని, కాంగ్రెస్ కార్యకర్తలు మీ బట్టలూడదీసి కొడతారని టీపీసీసీ అధ్యక్షుడు మహే్షకుమార్ గౌడ్ హెచ్చరించారు.
ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న అబద్ధపు ప్రచారాలను ఎండగట్టి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రచారం చేయడంలో ముందుండాలని టీపీసీసీ అధ్యక్షుడు మహే్షకుమార్ గౌడ్ నూతన ఎమ్మెల్సీ అభ్యర్థులకు సూచించారు.
సామాజిక న్యాయం పాటించడంలో కేరాఫ్ అడ్ర్సగా కాంగ్రెస్ పార్టీ నిలిచిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు అవకాశం వస్తే ఒక సీటు పొత్తులో భాగంగా సీపీఐకి ఇచ్చామన్నారు.
అన్ని కోణాల్లో ఆలోచించే ఎమ్మెల్సీ అభ్యర్థులను పార్టీ అధిష్ఠానం ఎంపిక చేసిందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చెప్పారు. పార్టీ అభ్యర్థులు అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్కు శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. తమ సర్కారు ఏర్పడిన 48 గంటల్లో మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రారంభించినట్టు తెలిపారు.
ముప్పై ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీనే నమ్ముకుని సేవలు అందిస్తున్న సీనియర్ నాయకులు జెట్టి కుసుమ్ కుమార్, కుమార్రావుకు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవులు ఇవ్వాలని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు.
ప్రతీ ఎన్నికల్లో ఓట్ల కోసం బీజేపీ దేవుడి పేరును వాడుకొని లబ్ధి పొందుతోందని, మతవిద్వేషాలతో ఎన్నికల్లో లబ్ధి కోరుకోవడం దేశాభివృద్ధికి విఘాతమని టీపీసీసీ అధ్యక్షుడు మహే్షకుమార్ గౌడ్ విమర్శించారు.
ప్రభుత్వం నిర్వహించిన కులగణన ఎట్లా తప్పో చెప్పాలంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డిలకు సీఎం రేవంత్రెడ్డి సవాల్ విసిరారు. బట్ట కాల్చి మీద వేయడం కాదని, రాష్ట్రంలోని ఏ బ్లాక్లోని ఏ ఇంట్లో లెక్క తప్పు జరిగిందో చూపాలన్నారు.
సీఎం రేవంత్రెడ్డికి, మంత్రులకు ఎలాంటి భేషజాలు లేవని, సమష్ఠి నిర్ణయాలతోనే అభివృద్ధి, సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలని, యువజన కాంగ్రెస్ నాయకులు సైనికుల్లా పనిచేయాలని, సీఎం రేవంత్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీపీసీసీ అధ్యక్షుడు మహే్షకుమార్గౌడ్ పిలుపునిచ్చారు.