Home » Naravaripalle
తిరుపతి జిల్లా: చంద్రగిరి మండలం, నారావారిపల్లెలో విషాదం చోటు చేసుకుంది. పంటపొలాల్లోకి ఏనుగుల రావడంతో వాటిని తిరిమేందుకు గ్రామస్తులతోపాటు ఉప సర్పంచ్ మార్పూరి రాకేష్ కూడా వెళ్లాడు. ఏనుగుల గుంపు పారిపోగా.. ఓ గున్న ఏనుగు ఉండిపోయింది. దాని అరుపులతో మళ్లీ ఏనుగుల గుంపు వెనక్కి వచ్చాయి. ఈ క్రమంలో గ్రామస్తులు పారిపోగా.. రాకేష్ అక్కడే ఉన్నాడు. గుంపులో ఓ ఏనుగు రాకేష్ను తొండంతో పట్టుకుని నేలకేసి కొట్టింది.
Andhrapradesh: మంచు మోహన్ బాబుకు కాలేజ్కు వద్దకు వచ్చిన మనోజ్ను పోలీసులు అడ్డుకుని.. ఇంజక్షన్ ఆర్డర్ ఉన్న విషయాన్ని తెలియజేశారు. కాలేజ్కు సంబంధించి నాలుగు గేట్ల వద్దకు మనోజ్ చేరుకుని అక్కడి పోలీసులతో మాట్లాడి విషయం తెలుసుకున్నారు. మనోజ్తో పాటు భార్య మౌనిక కూడా కాలేజ్కు వచ్చారు. ఆ వ్యవహారాన్ని మొత్తం వీడియో తీశారు మనోజ్ ప్రైవేట్ సెక్యూరిటీ.
Manchu Manoj: నిన్నటి నుంచి మోహన్ బాబు కాలేజీ వద్ద, నారావారిపల్లె వరకు మంచు ఫ్యామిలికీ సంబంధించిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఓవైపు మనోజ్, విష్ణు ఫ్లెక్సీలు వెలిశాయి. అయితే నిన్న రాత్రికి రాత్రి మంచు మనోజ్కు సంబంధించి ఫ్లెక్సీలను తొలగించేశారు. సుమారు వంద వరకు ఉన్న ఫ్లెక్సీలను తొలగించేశారు.
భారతదేశంలో 64 లక్షల పెన్షన్లు ఇచ్చే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. పెన్షన్ల కోసం ఏటా రూ.33 వేల కోట్లు ప్రజలకు ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు. హెల్దీ, వెల్దీ, హ్యాపీ సొసైటీ అనేవే కూటమి ప్రభుత్వ లక్ష్యాలని సీఎం చెప్పారు. పేదరికం, ఆర్థిక అసమానతలు రూపుమాపేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.
CM Chandrababu: మకర సంక్రాంతి.. ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు నింపాలని సీఎం చంద్రబాబు అన్నారు. మన పల్లెలు.. పాడిపంటలతో మరింత కళకళలాడాలని సీఎం చంద్రబాబు కోరుకున్నారు. ఎంత ఎదిగినా మన మూలాలు, సంప్రదాయాలు మరిచిపోకూడదని సీఎం చంద్రబాబు అన్నారు.
నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు కుటుంబం సందడి చేసింది. సంక్రాంతి పండుగ కోసం చంద్రబాబు కుటుంబం స్వగ్రామానికి వెళ్లింది. అక్కడ జరిగిన ఆటల పోటీల్లో లోకేశ్ కుమారుడు దేవాన్ష్ సందడి చేశాడు.
సీఎం చంద్రబాబు తిరుపతిలో జరిగిన కార్యక్రమాలను ముగించుకుని సంక్రాంతి పండగను కుటుంబంతో కలిసి స్వగ్రామంలో జరుపుకొనేందుకు ఆదివారం రాత్రి నారావారిపల్లెకు చేరుకున్నారు. ఇప్పటికే మంత్రి నారా లోకేశ్, భువనేశ్వరి నారావారిపల్లెకు చేరుకున్నారు.
Chandrababu: సీఎం చంద్రబాబు నాయుడు.. తన సొంతూరు నారా వారి పల్లెకు పయనమయ్యారు. ఈ ప్రయాణంలో భాగంగా ఆయన తొలుత తిరుపతిలో ఆగనున్నారు. తిరుచానూరులో ఇంటింటికి గ్యాస్ పైప్ లైన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు శనివారం మధ్యాహ్నం హైదరాబాద్లో కన్నుమూశారు. ఆయన పార్థివ దేహానికి పలువురు ప్రజా ప్రతినిధులు సినీ నటులు నివాళులర్పించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు శనివారం మధ్యాహ్నం కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో ఆయన తుదిశ్వాస విడిచారు. మధ్యాహ్నం నారావారిపల్లెలో అంత్యక్రియలు జరగనున్నాయి. రామ్మూర్తి నాయుడు మృతితో ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులు, చంద్రబాబు అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు.