Home » New Delhi
ఇండియా గ్రోత్ గురించి మోదీ వివరిస్తూ 21వ శతాబ్దిలో వికసిత్ భారత్ కోసం ప్రతి ఒక్క భారతీయుడు ఈరోజు అవిశ్రాంతంగా కృషి చేస్తు్న్నారని చెప్పారు. 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో ప్రతి రంగంలోనే ఉత్తమ నాయకత్వం అవసరమని, అది కేవలం రాజకీయాలకే పరిమిత కారాదని అన్నారు.
ఢిల్లీ సీఎం ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. ఢిల్లీలో సమావేశమైన బీజేపీ శాసనసభపక్ష సమావేశంలో ఢిల్లీ కొత్త సీఎంను ఎన్నుకున్నారు. గత కొద్దిరోజులుగా ఎన్నో పేర్లు సీఎం రేసులో వినిపించినప్పటికీ చివరి వరకు గోప్యత పాటించిన బీజేపీ అధిష్టానం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఒకరోజు ముందు ఢిల్లీ సీఎం పేరును ప్రకటించింది.
ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమం గురువారం మధ్యాహ్నం రామ్ లీలా మైదాన్లో జరగనుంది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కొత్త సీఎం చేత ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ నుంచి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరవుతున్నారు.
సత్యేంద్ర జైన్ను ప్రాసిక్యూట్ చేసేందుకు తగినన్ని ఆధారాలను ఎన్ఫోర్సెంట్ డైరక్టరేట్ సేకరించినట్టు ఎంహెచ్ఏ తెలిపింది. దీంతో ఆయనపై లీగల్ చర్యలు తీసుకునేందుకు అనుమతించాల్సిందిగా రాష్ట్రపతిని తాము కోరామని పేర్కొంది.
అయోధ్య వివాదం ముగిసిన తర్వాత కాశీ విశ్వనాథ్-జ్ఞానవాపి, శ్రీకృష్ణ జన్మస్థలం-మధుర ఈద్గావ్, శంభాల్ ధర్మా వంటి వివాదాలు తెరపైకి వచ్చాయి. ఈ క్రమంలో సుప్రీంకోర్టు పలు పిటిషన్లు దాఖలయ్యాయి.
ఈనెల 17,18 తేదీల్లో ఖతార్ ఆమీర్ అధికార పర్యటన కొనసాగనుంది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఈఏఎం డాక్టర్ ఎస్.జైశంకర్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ఆయన భేటీ అవుతారు. 18న రాష్ట్రపతి భవన్లో అమీర్కు అధికారిక స్వాగతం లభిస్తుంది.
బీజేపీ నుంచి గెలిచిన 48 మంది ఎమ్మెల్యేలలో ఒక్కరిపై కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నమ్మకం లేదని, ఆ పార్టీకి ఒక విజన్ కానీ, ప్రభుత్వాన్ని నడపగలిగే వ్యూహం కానీ లేవని అతిషి విమర్శించారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమం గురువారం ఉంటుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. విదేశీ పర్యటన ముగించుకుని ప్రధాని భారత్ చేరుకున్నాక ఢిల్లీ సీఎం ఎవరనేదానిపై స్పష్టత రానుందని సమాచారం. బుధవారం ఢిల్లీ బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశమై సీఎల్పీ నేతను ఎన్నుకుంటారట.
ఢిల్లీలో తరచూ భూకంపాలు సాధారణమేనని నిపుణులు చెబుతున్నారు. దేశ రాజధాని నాలుగో సీస్మిక్ జోన్లో ఉండటమే ఇందుకు కారణమని అంటున్నారు.
దాదాపు 27 ఏళ్ల నిరీక్షణకు తెరపడి ఫిబ్రవరి 5న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హస్తినను బీజేపీ కైవసం చేసుకుంది. 70 అసెంబ్లీ స్థానాల్లో 48 స్థానాలను బీజేపీ గెలుచుకోగా, గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని హవా సాగించిన ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 22 స్థానాలకే పరిమితమైంది.