Home » Pressmeet
బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఈసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మా తడాఖా ఏంటో ప్రభుత్వానికి చూపిస్తామని అన్నారు. ప్రభుత్వానికి ధైర్యం ఉంటే రాష్ట్రంలో 12 వేలకు పైగా గ్రామాల్లో ప్రభుత్వ పనితనంపై అఖిల పక్షం టూర్ పెట్టాలని.. తాము వస్తామని ఆయన అన్నారు.
విజయవాడలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు భవన్ నిర్మానానికి గురువారం ఉదయం శంఖుస్థాసన చేశామని ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు. సమాజానికి ఏది అవసరమో, సేవభావంతో అది చేసేందుకు ఎన్టీఆర్ ట్రస్టు ఎప్పుడూ ముందు ఉంటుందని, ప్రజలకు ఏదైతే చెప్పామో అది చేసి చూపటమే ఎన్టీఆర్ ట్రస్ట్ లక్ష్యమని భువనేశ్వరి స్పష్టం చేశారు.
గత ప్రభుత్వం (బీఆర్ఎస్) చేసిన మంచి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం తుడిచి పెట్టాలని చూస్తోందని, ఎస్ఆర్ఎస్పీ నీరు తగ్గినా కూడా కాళేశ్వరం ద్వారా రెండు పంటలకు సాగునీరు విడుదల చేశామని హరీష్ రావు చెప్పారు. మేడిగడ్డలోని ఒక్క బ్లాక్లోని ఒక పిల్లర్ మాత్రమే కుంగితే బీఆర్ఎస్ పై బురద జల్లి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కార్యచరణ చేపట్టారు. అందులోభాగంగా పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా వరుస సమీక్షాలను ఆమె నిర్వహిస్తున్నారు.
ఎన్నికలలో వైసీపీ ఎప్పటికప్పుడు మాట మారుస్తూ వచ్చిందని, చివరకు పీడీఎఫ్ అభ్యర్దికి వైసీపీ మద్దతు ఇచ్చిందని టీడీపీ నేత ఆలపాటి రాజా అన్నారు. వైసీపీ సమాజానికి చేసిన అన్యాయం మర్చిపోలేదని.. ప్రజలు గుణపాఠం చెప్పారన్నారు. 483 బూత్లలో ఒక్క బూత్లో కూడా పీడీఎఫ్ అభ్యర్థికి మెజారిటీ రాలేదన్నారు.
హైదరాబాద్: కేంద్రమంత్రి కిషన్రెడ్డికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రేవంత్ రెడ్డి 9 పేజీల లేఖ రాశారు. ప్రభుత్వ విజ్ఞప్తులను ఆ లేఖలో ప్రస్తావించారు. ఆ లేఖలో తేదీలతో సహా ప్రస్తావించారు. తెలంగాణను కేంద్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి తెలంగాణకు ఏం చేశారో చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
అధర్మంగా, దుర్గార్గంగా వ్యవహరించిన ప్రతి ఒక్కరినీ ధర్మం శిక్షిస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ లను పోసాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి దూషించాడని, ఇంట్లో ఉన్న ఆడ బిడ్డల గురించి కూడా చాలా అసహ్యంగా మాట్లాడాడని మంత్రి మండిపడ్డారు. సోషల్ మీడియాలో ఆడబిడ్డలపై అనుచిత పోస్టులు పెట్టే ఏ ఒక్కరినీ ఉపేక్షించమని స్పష్టం చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిని ప్రశ్నించిన వారి మరణాలపై రాజకీయ దుమారం రేగుతోంది. అయితే వీరి మరణాలపై అనుమానాలు ఉన్నాయంటూ స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బుధవారం వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. సీఎం వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
అసెంబ్లీ కి అన్నిపార్టీలు. వచ్చాయని, వైసీపీ నేతలు నల్ల కండువాలు వేసుకుని వచ్చారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. అధిక స్థానాలు వున్న వారికి అధికార పక్షం రెండవ స్థానం వచ్చిన వారికి ప్రతిపక్షం ఇస్తారని, మరి వైసీపీలో 11 మంది గెలిచి ప్రతిపక్ష హోదా కావాలి అంటున్నారని.. జగన్ వింత పోకడలు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోందన్నారు.
బీఆర్ఎస్ నేతలకు మానవత్వం లేదని.. ఎస్ఎల్బీసీ ప్రమాదాన్ని రాజకీయం చేయడం మంచి పద్ధతి కాదని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు నిరంతరం అక్కడ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. తూప్రాన్ రైలు ప్రమాదంలో స్కూల్ విద్యార్థులు చనిపోతే కేసీఆర్ కనీసం వెళ్లి పరమర్శించలేదని విమర్శించారు. మీరు చేయని పనులు మేము చేస్తున్నామని.. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అందరం కలిసికట్టుగా ఉండాలన్నారు.