Home » Samajwadi Party
సార్వత్రిక ఎన్నికల వేళ దేశంలో ఉత్తర్ప్రదేశ్కు ప్రత్యేక స్థానం ఉంది. అత్యధిక లోక్సభ స్థానాలు ఉండటం ఒకటైతే.. ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వంటి నేతలు ఈ రాష్ట్రం నుంచి పోటీచేస్తుండటంతో యూపీ రోజూ వార్తల్లో నిలుస్తోంది. ఈ ఇద్దరు వ్యక్తులే కాకుండా ఎంతోమంది ప్రముఖులు యూపీలోని వివిధ నియోజకవర్గాల నుంచి పోటీచేస్తున్నారు.
దేశంలోని అత్యధిక లోక్సభ స్థానాలు కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఇక్కడ ఎక్కువ సీట్లు గెలిస్తే కేంద్రంలో అధికారంలోకి రావచ్చనేది అన్ని ప్రధాన రాజకీయ పార్టీల అంచనా. 2014, 2019 ఎన్నికల్లో యూపీలో మెజార్టీ సీట్లు గెలుచుకోవడం ద్వారా ఎన్డీయే కూటమి రెండు సార్లు కేంద్రంలో అధికారంలోకి రాగలిగింది.
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో కాంగ్రెస్ సభలో తొక్కిసలాట జరిగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఫుల్పూర్లో నిర్వహించిన సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ హాజరయ్యారు. ఈ నేతలిద్దరూ వేదికపైకి చేరుకున్న తరువాత.. సభకు వచ్చిన జనం వేదికకు దగ్గరగా వచ్చే ప్రయత్నం చేయగా తొక్కిసలాట జరిగింది.
కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలకు అధికారం ఇస్తే అయోధ్యలో నిర్మించిన రామాలయంపైకి బుల్డోజర్ను పంపుతాయని ప్రధాని మోదీ అన్నారు. బుల్డోజర్లను ఎక్కడ నడపాలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వద్ద ట్యూషన్ చెప్పించుకోవాలని సూచించారు.
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎస్పీతో కూడిన విపక్ష ఇండియా కూటమి గెలిస్తే అయోధ్యలో రామమందిరాన్ని బుల్డోజర్లతో కూల్చివేస్తారని ప్రధాని మోదీ(PM Modi) సంచలన వ్యాఖ్యలు చేశారు.
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమికి మద్దతు ఇవ్వాలని ఉత్తరప్రదేశ్ ప్రజలకు ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విజ్జప్తి చేశారు. గురువారం లఖ్నవూలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కేజ్రీవాల్తోపాటు సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఆప్ నేత సంజయ్ సింగ్ పాల్గొన్నారు.
‘‘పార్టీ తరఫున ఇక్కడ ఎవరిని నిలిపినా గెలిపిస్తాం.. ఈసారి భయ్యాజీ (అన్నయ్య) తిరిగొచ్చిండు. ఇక విజయం మాదే’’.. ఇదీ యూపీలోని కనౌజ్ నియోజకవర్గం సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) శ్రేణుల మాట. అత్తరు పరిశ్రమకు పేరుగాంచిన ఈ స్థానం ఎస్పీకి కంచుకోట. ఆ పార్టీ ఆవిర్భావం తర్వాత తొమ్మిదిసార్లు ఎన్నికలు జరిగితే ఏడుసార్లు గెలిచింది.
ఉత్తరప్రదేశ్లో ఎన్డీయే, ఇండియా కూటమి మధ్య ప్రధాన పోరు కొనసాగుతున్న వేళ ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్.. బీఎస్పీ అధినేత్రి మాయావతిని టార్గెట్ చేశారు. మరోవైపు అఖిలేష్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాయావతి. బీఎస్పీ నేషనల్ కోఆర్డినేటర్ పదవి నుంచి తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్ను మాయావతి తప్పించారు. ఏడాది క్రితం ఇచ్చిన వారసత్వ బాధ్యతల నుంచి కూడా తప్పించినట్లు ప్రకటించారు. దీంతో మాయావతి తీసుకున్న ఈ నిర్ణయంపై ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ఎక్స్లో ట్వీట్ చేశారు.
ఢిల్లీలో అధికారంలోకి రావాలంటే యూపీలో గెలవాలి. ఎవరిని అడిగినా ఇదే చెబుతారు. అత్యధిక లోక్సభ స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్లో ఏ పార్టీ ఎక్కువు సీట్లు గెలిస్తే ఆ పార్టీ కేంద్రంలో అధికారానికి దగ్గరవుతుందనేది వాస్తవం. దీంతో ఈ ఎన్నికల్లో యూపీలో సత్తా చాటేందుకు ఎన్డీయే, ఇండియా కూటములు తమ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లో 80 లోక్సభ స్థానాలుండగా.. మూడు విడతల పోలింగ్ ముగిసింది. ఇప్పటివరకు జరిగిన పోలింగ్లో గత ఎన్నికలతో పోలిస్తే ఓటింగ్ శాతం తగ్గడం రాజకీయ పార్టీలను టెన్షన్ పెడుతున్నాయి.
కనౌజ్ లోక్సభ అభ్యర్థి, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షడు అఖిలేష్ యాదవ్ స్థానిక సిద్దపీట్ బాబా గౌరీ శంకర్ మహదేవ మందిర్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.