Home » Sonia Gandhi
రాష్ట్రపతి కార్యాలయం గౌరవాన్ని నిలిపేందుకు కాంగ్రెస్ పార్టీ ఎన్నటికీ కట్టుబడి ఉంటుందని ఖర్గే పునరుద్ఘాటించారు. దేశ ఆర్థిక పరిస్థితి బాగో లేదని చెప్పేందుకు ఆమె వాడిన "పూర్ థింక్'' అనే పదాన్ని వక్రీకరించి బీజేపీ నేతలు, ఒక వర్గం మీడియా తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు.
ఢిల్లీలోని ద్వారకలో శుక్రవారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో మోదీ మాట్లాడుతూ, ద్రౌపది ముర్ము ఒక గిరిజన కుటుంబం నుంచి రాష్ట్రపతి స్థాయికి ఎదిగారని, ఆమెను అవమానించడం దేశంలోని 10 కోట్ల మంది గిరిజనులను అవమానించడమేనని అన్నారు.
దేశ అత్యున్నత కార్యాలయం హోదాను తగ్గించేలా సోనియాగాంధీ వ్యాఖ్యలు ఉన్నాయని, ఆ మాటల్లో ఎంతమాత్రం వాస్తవం లేదని రాష్ట్రపతి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
Sonia Gandhi: బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. ఆమె ప్రసంగంపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీలు స్పందించారు.
గాంధీ కుటుంబంపై దేశ ప్రజలకు తెలియకూడనివి ఈ లేఖల్లో ఏముందని బీజేపీ ప్రశ్నించింది. 2008లో ఈ మ్యూజియం నుంచి 51 పెట్టెలను తరలించారని సోనియా గాంధీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో నెహ్రూ లేఖలు సైతం ఉన్నాయని బీజేపీ ఈ సందర్భంగా స్పష్టం చేసింది.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియాగాంధీ 78వ జన్మదిన వేడుకలను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి ఆధ్వర్యంలో సంగారెడ్డిలో సోమవారం ఘనంగా నిర్వహించారు. సోనియా, రాహుల్ ఫొటోలతో కటౌట్లు ఏర్పాటు చేశారు.
పార్లమెంట్ సమావేశాల్లో అదానీ అంశంపై చర్చించాలని విపక్షాలు పట్టుబడుతున్న నేపథ్యంలో అధికార బీజేపీకి ‘జార్జ్ సోరోస్’ అస్త్రం దొరికింది.
రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే నాయకత్వంలో శాసనసభ ఎన్నికల వేళ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుకు కట్టుబడి ఉన్నామని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. పార్టీ అగ్రనేతల మాటలు విశ్వసించి ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని ఆయన చెప్పారు.
అదానీపై రాహుల్ గాంధీ ప్రెస్ కాన్ఫరెన్స్ను జార్జి సోరోస్ నుంచి నిధులు పొందే ఓసీసీఆర్పీ సంస్థ లైవ్ టెలికాస్ట్ చేసిందని, దీనిని బట్టే జార్జ్ సోరోస్తో కాంగ్రెస్కు ఉన్న బలమైన సంబంధం అర్ధమవుతుందని బీజేపీ ఆరోపించింది.
తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయం ఆవరణలో సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ హాజరయితే ఆయన గౌరవం పెరుగుతుందన్నారు.