Home » tihar jail
ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయ్యి తీహార్ జైలులో ఉన్న కల్వకుంట్ల కవిత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు..
ఢిల్లీ మద్యం విధానం కుంభకోణంలో అరెస్టయి తిహాడ్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి చుక్కెదురైంది. ఈడీ, సీబీఐ కేసులకు సంబందించి ఆమె పెట్టుకున్న బెయిల్ పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. మహిళ అనే కారణంతో కవితపై సానుభూతి చూపలేమని కోర్టు స్పష్టం చేసింది.
మూడు నెలలుగా తీహార్ జైలులో ఉన్న కవిత బెయిల్ పిటిషన్పై ఈరోజు ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించనుంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అవకతవకలు జరిగాయని సీబీఐ , ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఈడీ నమోదు చేసిన కేసులో ప్రస్తుతం కవిత అరెస్ట్ అయ్యారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో(Delhi Liquor Scam) సీఎం అరవింద్ కేజ్రీవాల్కు 3 రోజుల సీబీఐ కస్టడీ శనివారం పూర్తయింది. కస్టడీ ముగియడంతో సీబీఐ అధికారులు.. కేజ్రీవాల్ను(Arvind Kejriwal) కోర్టులో హాజరు పరిచారు.
న్యూఢిల్లీ: బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టు అయి తిహాడ్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో శుక్రవారం ఉదయం ఆయన భేటీ అయ్యారు. ములాఖాత్ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవితతో ఆమె సోదరుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ములాఖత్ అయ్యారు. కవిత యోగ క్షేమాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఢిల్లీ మద్యం పాలసీ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కవిత ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో ప్రధాన పాత్ర పోషించిన కల్వకుంట్ల కవితపై మనీలాండరింగ్ చట్టంలోని సెక్షన్ 4 కింద చర్యలు తీసుకోవాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ప్రత్యేక కోర్టును కోరింది. ఆమె ఆస్తుల స్వాధీనానికి ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేసింది. మద్యం కుంభకోణంలో మొత్తం రూ.1100 కోట్ల మేరకు అక్రమాలు జరిగాయని, ఇందులో కవిత పాత్ర రూ.292 కోట్ల మేరకు ఉందని తెలిపింది.
సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ముగియడంతో ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ ఆదివారం మళ్లీ తిహాడ్ జైలుకు వెళ్లారు. జైలుకు వెళ్లడానికి ముందు తన నివాసంలో తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకున్నారు.
ఎక్సైజ్ పాలసీ కేసు నిందితుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం సాయంత్రం తీహారు జైలు అధికారులకు లొంగిపోయారు. వెంటనే ఆయనను రౌస్ అవెన్యూ కోర్టు డిప్యూటీ జడ్జి సంజీవ్ అగర్వార్ ముందు హాజరుపరిచారు. ఈనెల 5వ తేదీ వరకూ కేజ్రీవాల్కు కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్కి(CM Arvind Kejriwal) సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ గడువు ముగుస్తుండటంతో జూన్ 2న ఆయన తిహార్ జైల్లో పోలీసులకు తిరిగి లొంగిపోనున్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారానికి పార్టీ అధినేతగా తనకు బెయిల్ ఇవ్వాలని ఆయన సుప్రీం తలుపు తట్టిన విషయం తెలిసిందే.