పుంగనూరు సీఐగా ప్రసాద్బాబు
ABN , First Publish Date - 2021-01-31T06:02:30+05:30 IST
పుంగనూరు సీఐ గంగిరెడ్డిని విజయవాడ పోలీస్ హెడ్ క్వార్టర్స్కు బదిలీ చేసి ఆ స్థానంలో నూతన సీఐగా ప్రసాద్బాబును ప్రభుత్వం నియమించింది.

విజయవాడ హెడ్ క్వార్టర్స్కు సీఐ గంగిరెడ్డి
పుంగనూరు , జనవరి 30: పుంగనూరు సీఐ గంగిరెడ్డిని విజయవాడ పోలీస్ హెడ్ క్వార్టర్స్కు బదిలీ చేసి ఆ స్థానంలో నూతన సీఐగా ప్రసాద్బాబును ప్రభుత్వం నియమించింది. శనివారం చిత్తూరు స్పెషల్బ్రాంచి సీఐ ప్రసాద్బాబు సీఐగా బాధ్యతలు స్వీకరించారు. గత ఏడాది మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో విధులు నిర్వహించడంలో విఫలమయ్యారని సీఐ గంగిరెడ్డిని ఎన్నికల కమిషన్ బదిలీ చేసిన విషయం తెలిసిందే. ప్రసుత్తం స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గంగిరెడ్డిని పోలీస్ హెడ్ క్వార్టర్స్లో రిపోర్టు చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది.
