Share News

శంకర హర హర

ABN , First Publish Date - 2023-12-05T00:17:17+05:30 IST

అఖండ గౌతమీ గోదావరి తీరం కొవ్వూరు గోష్పాదక్షేత్రం భక్తజన సందోహంగా మారింది. శివ నామ స్మరణతో క్షేత్రమంతా మారుమోగింది. కార్తీక సోమవారం సందర్భంగా వేకువజాము నుంచి భక్తులు అధికసంఖ్యలో కొవ్వూరు గోష్పాదక్షేత్రానికి చేరుకుని గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు.

శంకర హర హర
కొవ్వూరు గోష్పాదక్షేత్రం వద్ద పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తులు

  • పలుచోట్ల కార్తీక సోమవారం పూజలు.. పుణ్యస్నానాలు

కొవ్వూరు, డిసెంబరు 4 : అఖండ గౌతమీ గోదావరి తీరం కొవ్వూరు గోష్పాదక్షేత్రం భక్తజన సందోహంగా మారింది. శివ నామ స్మరణతో క్షేత్రమంతా మారుమోగింది. కార్తీక సోమవారం సందర్భంగా వేకువజాము నుంచి భక్తులు అధికసంఖ్యలో కొవ్వూరు గోష్పాదక్షేత్రానికి చేరుకుని గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. ప్రధాన స్నానఘట్టంలోని శివలింగాలకు నదీ జలాలతో అభిషేకాలు చేశారు. మహిళలు అరటి డొప్పల్లో కార్తీక దీపాలు వెలిగించి నదిలో విడిచిపెట్టారు. అనంతరం సుందరేశ్వరస్వామిని దర్శించుకుని పంచామృత అభిషేకాలు నిర్వహించారు. రావిచెట్టు వద్ద నాగశిలలను నదీ జలాలతో అభిషేకించారు. ప్రదాన స్నానఘట్టం, తులసి చెట్టు, రావిచెట్ల వద్ద సుందరేశ్వరస్వామి ఆలయంలో ద్వజ స్తంభం, నందీశ్వరుని వద్ద కార్తీక దీపాలను వెలిగించారు. బ్రాహ్మణులకు స్వయంపాకం దానం చేశారు. సాయంత్రం ఆలయంలో టీటీడీ నుంచి వచ్చిన దుర్గాబాయి పురంధరదాసు కీర్తనలు ఆలపించారు. అనంతరం జ్యోతిర్లింగార్చన నిర్వహించారు. అలాగే మండలంలోని వాడపల్లి, తోగుమ్మి, ఆరికిరేవుల, కుమారదేవం, చిడిపి, పెనకనమెట్ట, ధర్మవరం, దొమ్మేరు, మద్దూరు, వేములూరు గ్రామాల్లోని శివాలయాల్లో భక్తులు కార్తీక దీపాలు వెలిగించి, ప్రత్యేక పూజలు చేశారు.

Updated Date - 2023-12-05T00:17:23+05:30 IST