ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kondru Murali Mohan: తమ్మినేని స్పీకర్ స్థానాన్ని అగౌరవపర్చారు

ABN, First Publish Date - 2023-09-21T20:26:13+05:30

ఈ రోజు జరిగిన అసెంబ్లీ సెషన్స్‌(Assembly Sessions)లో స్పీకర్ తమ్మినేని సీతారాం(Speaker Tammineni Sitaram) తన స్థానాన్ని అగౌరవపరిచారని మాజీమంత్రి కొండ్రు మురళీమోహన్(Kondru Murali Mohan) వ్యాఖ్యానించారు.

అమరావతి: ఈ రోజు జరిగిన అసెంబ్లీ సెషన్స్‌(Assembly Sessions)లో స్పీకర్ తమ్మినేని సీతారాం(Speaker Tammineni Sitaram) తన స్థానాన్ని అగౌరవపరిచారని మాజీమంత్రి కొండ్రు మురళీమోహన్(Kondru Murali Mohan) వ్యాఖ్యానించారు. గురువారం నాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీలో సభా స్థానంలో ఉన్న తమ్మినేని వ్యవహార శైలి ఆక్షేపనీయం. నేను మొదట వైసీపీ కార్యకర్తని తర్వాతే అసెంబ్లీ స్పీకర్‌నని తమ్మినేని స్వయంగా చెప్పారు. స్పీకర్ స్థానానికి మచ్చ తెచ్చారు. రాజమండ్రి జైల్లో టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu)కు ప్రాణహాని ఉంది. జైల్లో చంద్రబాబును మర్డర్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు ప్రజల్లో చర్చ జరుగుతోంది. 14 ఏళ్లు సీఎంగా పని చేసిన ముఖ్యమంత్రికి కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలం అయ్యారు. చంద్రబాబుకు ఏమైనా జరిగితే పరిస్థితి చేజారిపోతుంది. బాబుకు జరగకూడనిది జరిగితే దానికి బాధ్యత జగన్‌దేనని కొండ్రు మురళీమోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-09-21T20:26:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising