ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Minister Payyavula: శ్రీనివాసుడి గురించి మాట్లాడే హక్కు నీకు లేదు: మంత్రి పయ్యావుల..

ABN, Publish Date - Oct 04 , 2024 | 05:42 PM

వైసీపీ హయాంలో తిరుమలలో ఉన్న పటిష్టమైన వ్యవస్థను వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి నాశనం చేశారని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. టీటీడీ ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి సైతం అనేక తప్పులు చేశారని మంత్రి మండిపడ్డారు.

AP Finance Minister Payyavula Keshav

హైదరాబాద్: తిరుమల వేంకటేశ్వరస్వామి గురించి మాట్లాడే హక్కు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి లేదని ఏపీ ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. తిరుమల విశిష్ట గురించి జగన్ మాట్లాడటం ప్రజల కర్మని ఆయన అన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో పయ్యావుల మాట్లాడారు. తిరుమల‌ లడ్డూ కల్తీ వ్యవహారంలో త్వరలోనే సిట్ విచారణ ప్రారంభం అవుతుందని, నిజాలు నిగ్గు తేలే రోజులు దగ్గరలోనే ఉన్నాయంటూ మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పుకొచ్చారు.


ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ.. "వేంకటేశ్వరస్వామి తనకు పునర్జమ్మ ఇచ్చారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అనేకసార్లు చెప్పిన విషయం జగన్ గుర్తుంచుకోవాలి. వైసీపీని లీడర్, క్యాడర్ విడిచిపెట్టిపోతున్న నేపథ్యంలో ఆత్మరక్షణలో జగన్ విలవిలలాడుతున్నారు. వేంకటేశ్వరస్వామిని నమ్ముతున్నాననే ఒక్కమాట జగన్ ఎందుకు చెప్పలేకపోతున్నారు. డిక్లరేషన్ మీద సంతకం పెట్టాల్సి వస్తుందనే ఆయన తిరుమల కొండకు వెళ్లలేదు. సనాతన ధర్మంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన ఆలోచనలు ప్రజల ముందుంచారు. ఆయన మంచి ఆలోచనలపై సమాజంలో చర్చ జరగాల్సిన అవసరం ఉంది.


వైసీపీ హయాంలో తిరుమలలో ఉన్న పటిష్టమైన వ్యవస్థను ఫ్యాన్ పార్టీ అధినేత జగన్ నాశనం చేశారు. టీటీడీ ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి అనేక తప్పులు చేశారు. సెట్టింగులు వేసి తిరుమలేశుడిని ఇంటికి రప్పించుకున్న ఘనత జగన్‌కే దక్కుతుంది. జగన్, వైసీపీ పునాదులు కదిలాయి కాబట్టే ఇప్పుడు తిరుమల గురించి ఆయన మాట్లాడుతున్నారు. స్వామివారిని, టీటీడీని అగౌరవపర్చిన వారు దోషులుగా నిలబడే సమయం దగ్గరలోనే ఉంది. వైసీపీ అధినేత ఏపీలో రాజకీయ ఉనికి కోల్పోతున్నారు. దాన్ని కాపాడుకునేందుకే విమర్శలు చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నప్పుడు తిరుమల కొండపై కమర్షియల్ యాక్టివిటీస్ చేశారు. రూ.150ల గదులను రూ.2వేలకు పెంచారు.


వైసీపీ హయాంలో తిరుమలకు సంబంధించి రూ.250కోట్ల టర్నోవర్‌ను రూ.150కోట్లకు తగ్గించారు. వాస్తవాలకు దూరంగా జగన్ మాట్లాడుతున్నారు. తాను చెప్పింది మాత్రమే నిజమనే భావనలో ఆయన ఉన్నారు. ఏపీ ప్రజలు మాజీ ముఖ్యమంత్రిని ఇంటికి పంపి వంద రోజులే అయ్యింది. అప్పుడే ఎన్డీయే ప్రభుత్వం, సీఎం చంద్రబాబుపై ప్రజల్లో భ్రమ కల్పించే ప్రయత్నం జగన్ చేస్తున్నారు. కానీ ఆయన మాటలు నమ్మే స్థితిలో ప్రజలు లేరు" అని అన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి:

CM ChandraBabu: కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్న సీఎం చంద్రబాబు..

Srinivas varma: జగన్‌పై కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ విసుర్లు

For More AndhraPradesh News and Telugu News

Updated Date - Oct 04 , 2024 | 06:12 PM