ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Nara Bhuvanevari: మాఫియా ముఠాలను పెంచి పోషిస్తున్న వైసీపీ ప్రభుత్వం

ABN, Publish Date - Mar 22 , 2024 | 03:23 PM

సీపీ ప్రభుత్వం (YSRCP Govt) మాఫియా ముఠాలను పెంచి పోషిస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) సతీమణి భువనేశ్వరి (Bhuvaneshwari) అన్నారు. ‘‘నిజం గెలవాలి’’ (Nijam Gelavali) యాత్రతో భాగంగా కడప జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో భువనేశ్వరి పర్యటిస్తున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌తో మనస్తాపం చెందిన మరణించిన వారి కుటుంబాలను ఆమె పరామర్శిస్తున్నారు.

కడప: వైసీపీ ప్రభుత్వం (YSRCP Govt) మాఫియా ముఠాలను పెంచి పోషిస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) సతీమణి భువనేశ్వరి (Bhuvaneshwari) అన్నారు. ‘‘నిజం గెలవాలి’’ (Nijam Gelavali) యాత్రలో భాగంగా కడప జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో భువనేశ్వరి పర్యటిస్తున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌తో మనస్తాపం చెందిన మరణించిన వారి కుటుంబాలను ఆమె పరామర్శిస్తున్నారు. ‘‘నిజం గెలవాలి’’ పేరుతో చనిపోయిన కార్యకర్తల కుటుంబాలను భువనేశ్వరి పరామర్శిస్తూ ఆర్థిక సాయం అందజేస్తున్నారు. ఇప్పటికే పలు గ్రామాల్లో పర్యటించిన ఆమె పలువురు కార్యకర్తల కుటుంబాలను కలిశారు.

Chandrababu: అందుకే ఎన్డీయేలో చేరాం...

శుక్రవారం నాడు కలసపాడు మండలం బ్రాహ్మణపల్లెలో వెంకటయ్య కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ... నాడు చంద్రబాబు జనం మరచి పోలేని అభివృద్ధి పనులు చేశారని చెప్పారు. నేడు జగన్ పాలనలో గంజాయి, ఇసుక , కల్తీమద్యం, మాఫియాలతో పాటు భూకబ్జాలకు అడ్డగా రాష్ట్రం మారిందని మండిపడ్డారు. ప్రస్తుతం తప్పడు పనుల్లో ఏపీ నెంబర్ వన్ స్థానంలో ఉందని అన్నారు. చంద్రబాబు అమలు చేసిన మంచి పథకాలను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. జగన్, ఆయన అనుచరులకు పనికి వచ్చే పథకాలను ఇప్పుడు అమలు చేస్తున్నారన్నారు. చంద్రబాబు చేసిన అభివృద్ధిని చూసి రాబోయే ఎన్నికల్లో ఓటు వేయాలని నారా భువనేశ్వరి పేర్కొన్నారు.

BJP: వైసీపీ పాలనలో అవినీతి.. డ్రగ్స్ కల్చర్ పెరిగిపోయింది: సాధినేని యామిని

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 22 , 2024 | 03:26 PM

Advertising
Advertising