Share News

కేరళలో నిఫాతో ఒకరి మృతి

ABN , Publish Date - Sep 16 , 2024 | 03:35 AM

కేరళలో నిఫా వైరస్‌ కారణంగా ఓ 24 ఏళ్ల వ్యక్తి మృతి చెందారు.

కేరళలో నిఫాతో ఒకరి మృతి

మలప్పురం, సెప్టెంబరు 15: కేరళలో నిఫా వైరస్‌ కారణంగా ఓ 24 ఏళ్ల వ్యక్తి మృతి చెందారు. మలప్పురానికి చెందిన వ్యక్తి బెంగళూరులో నివసిస్తూ.. ఈ నెల 9వ తేదీన ఇక్కడకు తిరిగొచ్చాడని, జ్వరం తదితర లక్షణాలతో మలప్పురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మరణించాడని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జి ఆదివారం వెల్లడించారు. అతని శాంపిళ్లను పరీక్షించగా నిఫా వైరస్‌ పాజిటివ్‌ వచ్చినట్లు తెలిపారు. అతడితో సన్నిహితంగా మెలిగిన 151 మందిని ఐసోలేట్‌ చేశామని, వారిలో ఐదుగురికి జ్వరం లక్షణాలున్నాయని చెప్పారు.

Updated Date - Sep 16 , 2024 | 03:35 AM