Share News

Delhi : తెలుగు రాష్ట్రాల్లో.. ‘తాగేస్తున్నారు’!

ABN , Publish Date - Aug 26 , 2024 | 04:22 AM

‘మందుబాబులం.. మేము మందుబాబులం..’ అన్న మాట తెలుగునాట నిజమైంది. దేశవ్యాప్తంగా మద్యం వినియోగంలో రెండు తెలుగు రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి.

Delhi : తెలుగు రాష్ట్రాల్లో.. ‘తాగేస్తున్నారు’!

  • దేశంలో అత్యధిక మందుబాబులిక్కడే

  • తెలంగాణలో వార్షిక తలసరి వినియోగ

  • వ్యయం రూ.1,623.. ఏపీలో 1,306

  • తర్వాతి స్థానాల్లో ఛత్తీస్‌గఢ్‌, పంజాబ్‌

  • కేంద్ర ఆర్థిక శాఖ విభాగం ‘నిపెప్‌’ వెల్లడి

న్యూఢిల్లీ, ఆగస్టు 25: ‘మందుబాబులం.. మేము మందుబాబులం..’ అన్న మాట తెలుగునాట నిజమైంది. దేశవ్యాప్తంగా మద్యం వినియోగంలో రెండు తెలుగు రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మద్యం వినియోగం ఆధారంగా కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని స్వయం ప్రతిపత్తి సర్వే విభాగం నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఫైనాన్స్‌ అండ్‌ పాలసీ(నిపెప్‌) తాజాగా విడుదల చేసిన అధ్యయనంలో వెల్లడించింది.

ఈ అధ్యయనానికి నేషనల్‌ శాంపిల్‌ సర్వే ఆఫీ్‌స(ఎన్‌ఎ్‌సఎ్‌సవో), కన్జ్యూమర్‌ పిరమిడ్స్‌ హౌస్‌హోల్డ్‌ సర్వే(ఎ్‌సపీహెచ్‌ఎ్‌స)లను ప్రామాణికంగా తీసుకుంది. దీని ప్రకారం.. మద్యంపై తెలంగాణ వార్షిక సగటు తలసరి వినియోగ వ్యయం రూ.1,623 ఉండగా, ఏపీలో రూ.1,306గా ఉంది.

ఎన్‌ఎ్‌సఎ్‌సవో ప్రకారం తర్వాత స్థానాల్లో ఛత్తీ్‌సగఢ్‌ రూ.1,227, పంజాబ్‌ రూ.1,245, ఒడిశా రూ.1,156గా ఉన్నాయి. కేరళ రూ.486, హిమాచల్‌ ప్రదేశ్‌ రూ.457, తమిళనాడు రూ.330, రాజస్థాన్‌ రూ.308 వ్యయం చేస్తున్నాయి. ఇక, రెండు సర్వే సంస్థలు ఇచ్చిన నివేదికల ప్రకారం ఉత్తరప్రదేశ్‌లో తలసరి వినియోగ వ్యయం రూ.75, రూ.49గా ఉండడం విశేషం.

మద్యం వినియోగం ద్వారా ఆయా రాష్ట్రాలు పన్నులు పిండుకుంటున్నాయని నిపెప్‌ అధ్యయనం తెలిపింది. మద్యంపై వస్తున్న పన్నులు రాష్ట్రాలకు మూడో అతి పెద్ద ఆదాయ వనరుగా ఉందని పేర్కొంది. జార్ఖండ్‌ అత్యల్పంగా 67 శాతం పన్నులు వసూలు చేస్తుండగా, గోవా అత్యధికంగా 722 శాతం ఆదాయం పొందుతున్నట్టు వివరించింది.

Updated Date - Aug 26 , 2024 | 04:22 AM