ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

KTR: సీఎం రేవంత్ భారీ కుంభకోణం.. కేటీఆర్ సంచలన ఆరోపణలు

ABN, Publish Date - Sep 21 , 2024 | 05:22 PM

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బావమరిది సూదిని సృజన్ రెడ్డి కంపెనీ కోసం భారీ కుంభకోణానికి పాల్పడ్డారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు సంచలన ఆరోపణలు చేశారు. వేలకోట్ల రూపాయలు పనులను సీఎం రేవంత్ కట్టబెట్టారని కేటీఆర్ ఆరోపణలు చేశారు.

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) భారీ కుంభకోణానికి పాల్పడ్డారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) సంచలన ఆరోపణలు చేశారు. ఈ స్కాం రూ. 8,888 కోట్లు ఉంటుందని సంచలన ఆరోపణలు చేశారు. ఈ కుంభకోణంపై విచారణ జరిపిస్తే రేవంత్ రెడ్డి సీఎం పదవి పోతుందని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.


ALSO Read:Gangula Kamalakar: ప్రతిపక్ష ఎమ్మెల్యేల హక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాస్తోంది

ముఖ్యమంత్రి బావమరిది సూదిని సృజన్ రెడ్డి కంపెనీకి అర్హతలు లేకున్నా వేలకోట్ల రూపాయలు పనులను కట్టబెట్టారని ఆరోపణలు చేశారు. ఇవాళ(శనివారం) తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. ఇండియన్ హ్యూమ్ పైప్ అనే కంపెనీని పిలిపించి బెదిరించి.. ఆ కంపెనీ పేరుతో టెండర్లను కట్టబెట్టారని కేటీఆర్ ఆరోపించారు.


ALSO Read: Prashanth Reddy: పీఏసీ నియామకంలో కూడా రాజకీయాలా..

‘‘పేరుకే ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ అయినా రేవంత్ రెడ్డి బావమరిది కోసం ఈ టెండర్లను కట్టబెట్టారు. ఇందులో టెండర్ దక్కించుకున్న సదరు కంపెనీతో రేవంత్ రెడ్డి బావమరిది కంపెనీ జాయింట్ వెంచర్ పేరుతో డ్రామాకు తెరలేపారు. 1137 కోట్ల రూపాయల కాంట్రాక్టు గెలుచుకున్న తర్వాత ఆ కంపెనీ 20 శాతం పనిచేస్తోంది. ముఖ్యమంత్రి బావమరిది మాత్రం 80% పని అంటే రూ. 1000 కోట్ల పని చేస్తోంది. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ఇంత పెద్ద భారీ కుంభకోణానికి రేవంత్ రెడ్డి పాల్పడ్డారు. తాను బీఆర్ఎస్ ప్రభుత్వంలో బాధ్యతలు నిర్వహించిన పురపాలక శాఖ కేంద్రంగా రేవంత్ రెడ్డి ఈ కుంభకోణాన్ని చేశారు. ఈ భారీ కుంభకోణంతో రేవంత్ రెడ్డి పదవీ కోల్పోయి అవకాశం ఉంది’’ అని కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

Prashanth Reddy: పీఏసీ నియామకంలో కూడా రాజకీయాలా..

KTR: ఏచూరీ సంస్మరణ సభలో కేటీఆర్ హాట్ కామెంట్స్..=

Sridhar Babu: సేమీ కండక్టర్ల రంగంలో ఉపాధి అవకాశాలు..

KTR: ఏచూరీ సంస్మరణ సభలో కేటీఆర్ హాట్ కామెంట్స్..

For More Telangana News and Telugu News..

Updated Date - Sep 21 , 2024 | 05:31 PM