ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Nagarkurnool: మాయమాటలతో చెల్లెలిని చెరబట్టిన అన్న

ABN, Publish Date - Jul 15 , 2024 | 04:58 AM

చెల్లెలిని కంటికి రెప్పలా కాపాడాల్సిన అన్నయ్య మాయమాటలతో ఆమెనే చెరబట్టాడు. కర్ణాటక రాష్ట్రంలోని ఓ గ్రామానికి చెందిన మహిళకు ఇద్దరు భర్తలున్నారు.

  • ఇద్దరు కలిసి ఇంటి నుంచి పారిపోయిన వైనం

  • జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు.. దర్యాప్తు

బిజినేపల్లి, జూలై 14: చెల్లెలిని కంటికి రెప్పలా కాపాడాల్సిన అన్నయ్య మాయమాటలతో ఆమెనే చెరబట్టాడు. కర్ణాటక రాష్ట్రంలోని ఓ గ్రామానికి చెందిన మహిళకు ఇద్దరు భర్తలున్నారు. మొదటి భర్తతో ఒక కుమారుడు, రెండో భర్తతో ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కొన్నేళ్ల క్రితం ఆమె తన నలుగురు పిల్లలతో కలిసి మహబూబ్‌నగర్‌కు వచ్చి స్థిరపడింది. గ్రెనేట్‌ రాయి కొట్టేందుకు ఆమె కుమారుడు (21) బిజినేపల్లి మండలంలోని ఓ తండాకు ముగ్గురు చెల్లెళ్లతో కలిసి వచ్చాడు. ఇక్కడే ఉంటూ పరిసర గ్రామాల్లో రాయి కొట్టేందుకు వెళ్తుండేవాడు. ఈ క్రమంలో మూడు నెలల క్రితం రెండో చెల్లెలి (15)కి మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. మహబూబ్‌నగర్‌కు వెళ్లిన తర్వాత కూడా సోదరితో సన్నిహితంగా మెలుగుతుండడాన్ని తల్లి గుర్తించి మందలించింది. తప్పుడు పనులు చేయొద్దంటూ హెచ్చరించింది.


ఈ నేపథ్యంలో గత నెల ఒకటిన ఇంట్లో నుంచి ఇద్దరు కలిసి వెళ్లిపోయారు. 10 రోజులు గడిచినా వారు తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో శనివారం వనపర్తి జిల్లా ఘణ్‌పూర్‌ మండలంలోని బలిజపల్లి గ్రామంలో వారిద్దరూ అనుమానాస్పదంగా కనిపించడంతో గ్రామస్థులు చైల్డ్‌ వెల్‌ఫేర్‌ కమిటీ (సీడబ్ల్యూసీ)కి సమాచారం ఇచ్చారు. అధికారులు వారిద్దరినీ విచారించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - Jul 15 , 2024 | 04:58 AM

Advertising
Advertising
<