రచ్చరేపుతున్న రెడ్‌బుక్ రాజకీయాలు..

ABN, Publish Date - Sep 11 , 2024 | 08:20 AM

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు రెడ్ బుక్ రాజకీయాలు రచ్చరేపుతున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పోలీస్ యంత్రాంగం టీడీపీ నేతలను వేధించింది. అలాంటి పోలీసుల పేర్లను రెడ్ బుక్‌లో రాసుకున్నామని అప్పట్లో లోకేష్‌తో పాటు కొందరు తెలుగుదేశం నేతలు చెప్పేవారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు రెడ్ బుక్ రాజకీయాలు రచ్చరేపుతున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పోలీస్ యంత్రాంగం టీడీపీ నేతలను వేధించింది. అలాంటి పోలీసుల పేర్లను రెడ్ బుక్‌లో రాసుకున్నామని అప్పట్లో లోకేష్‌తో పాటు కొందరు తెలుగుదేశం నేతలు చెప్పేవారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా చెల్లించుకోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చేవారు. ప్రజలు పట్టం కట్టడంతో టీడీపీ పవర్‌లోకి వచ్చింది. రెడ్ బుక్ తెరుస్తామని ఆ మధ్య చెప్పేవారు. ఇప్పుడు ఓపెన్ చేశారో..? లేక పక్కనపెట్టారో కానీ.. ప్రస్తుతం ఈ చర్చ రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది.


అయితే జిల్లాల్లోని కొందరు నేతలు కూడా ఇప్పుడు రెడ్ బుక్ రాజకీయాలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి కర్నూలు జిల్లా ఫ్యాక్షన్ గడ్డ ఆళ్లగడ్డలో రెడ్ బుక్ పాలిటిక్స్ అంశం ఇప్పుడు ఫ్యాన్ పార్టీలో ప్రకంపణలు సృష్టిస్తోంది. టీడీపీ ఎమ్మెల్యే భూమా అకిలప్రియ తానొక రెడ్ బుక్ తయారు చేశానని ఇటీవల ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏలూరు జిల్లాలో నేడు సీఎం చంద్రబాబు పర్యటన..

సజ్జల ఎక్కడ..?

హరియాణాలో వినేశ్‌ వర్సెస్‌ యోగేశ్‌

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Sep 11 , 2024 | 08:20 AM