Share News

మండుతున్న సూరీడు

ABN , Publish Date - Mar 17 , 2025 | 01:53 AM

జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. తవణంపల్లె మండలంలో ఆదివారం అత్యధికంగా 39.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అత్యధిక మండలాల్లో 40 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరువవుతుండటంతో జనం అల్లాడిపోతున్నారు.

మండుతున్న సూరీడు

తవణంపల్లెలో 39.7 డిగ్రీల ఉష్ణోగ్రత

చిత్తూరు సెంట్రల్‌, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. తవణంపల్లె మండలంలో ఆదివారం అత్యధికంగా 39.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అత్యధిక మండలాల్లో 40 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరువవుతుండటంతో జనం అల్లాడిపోతున్నారు. మండలాల వారీగా.. గంగవరంలో 39.2, నిండ్ర, ఎస్‌ఆర్‌పురంలో 38.8, గుడిపాల, చిత్తూరులో 37.5, పులిచెర్లలో 37.4, నగరిలో 37.3, పెద్దపంజాణిలో 37, సదుం, పులిచెర్లలో 36.7, గుడుపల్లెలో 36.6, పాలసముద్రం, వెదురుకుప్పం, విజయపురం, ఐరాల, చౌడేపల్లెలో 36.5, జీడీ నెల్లూరులో 36.3, బంగారుపాళ్యం, శాంతిపురంలో 36.2, పెనుమూరు, పలమనేరులో 36.1, సోమలలో 36, పూతలపట్టులో 35.9, యాదమరి, వి.కోటలో 35.8, కార్వేటినగరంలో 34.7, బైరెడ్డిపల్లెలో 34.6, రామకుప్పంలో 34.2, పుంగనూరులో 33.6, కుప్పంలో 33.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Updated Date - Mar 17 , 2025 | 01:53 AM