CM Chandrababu: ఇవాళ సీఎం చంద్రబాబు ఫుల్ బిజీ.. పూర్తి షెడ్యూల్ ఇదే..
ABN , Publish Date - Apr 14 , 2025 | 07:22 AM
CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం ఫుల్ బిజీగా ఉండనున్నారు. తాడిపత్రి నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటిస్తారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు షెడ్యూల్ బిజీగా ఉండనుంది.

అమరావతి: గుంటూరు జిల్లాలో ఇవాళ(సోమవారం) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఉదయం 10:30కి ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్లో తాడికొండ మండలం, పొన్నెకల్లు గ్రామానికి సీఎం చంద్రబాబు చేరుకోనున్నారు. ఉదయం 10:40కు స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో సమావేశం కానున్నారు. 11 గంటలకు స్థానిక ప్రజా ప్రతినిధులతో సమావేశం అవుతారు. అనంతరం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కాలనీ, పొన్నెకల్లుకు సీఎం చంద్రబాబు చేరుకోనున్నారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రజా సమస్యలపై చర్చిస్తారు. ఈ సందర్భంగా అధికారులతో పలు కీలక అంశాలపై సీఎం చంద్రబాబు మాట్లాడతారు.
అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి సీఎం చంద్రబాబు నివాళులు అర్పించనున్నారు. 12 గంటల వరకు స్థానికులను వారు పని చేసే చోట నేరుగా వెళ్లి కలవనున్నారు. 12.05 నిమిషాలకు పొన్నెకల్లు గ్రామం ఎంపీపీ స్కూల్లో జరిగే సమావేశానికి హాజరవుతారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను సీఎం చంద్రబాబు తిలకించనున్నారు. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి స్కాలర్షిప్ లబ్ధిదారులతో వర్చువల్గా ముఖ్యమంత్రి మాట్లాడనున్నారు. పీ- 4 కార్యక్రమంలో భాగంగా మార్గదర్శి - బంగారు కుటుంబాలతో రెండు గంటల పాటు ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై సీఎం చంద్రబాబు చర్చిస్తారు. ఈ సందర్భంగా మార్గదర్శులను సన్మానించనున్నారు. మధ్యాహ్నం 2:40 నిమిషాలకు టీడీపీ కేడర్తో సమావేశం కానున్నారు. ఈసమావేశంలో పార్టీ కేడర్కు చంద్రబాబు దిశానిర్దేశం చేస్తారు.
ఈ వార్తలు కూడా చదవండి
Minister Nara Lokesh: మీ కోసం నిలబడతా.. పోరాడతా
Police Dogs: పోలీసు జాగిలం.. బిజీబిజీ..
TTD Chairman BR Naidu: తిరుపతి ‘తొక్కిసలాట’వెనుక కుట్రకోణం!
Read Latest AP News And Telugu News