Vallabhaneni Vamsi: జైల్లో వల్లభనేని వంశీ చిందులు.. పోలీసులు సీరియస్

ABN, Publish Date - Feb 15 , 2025 | 07:56 AM

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీమోహన్‌కు విజయవాడ అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో వంశీని పోలీసులు విజయవాడ హనుమాన్ పేటలోని జిల్లా కారాగారానికి తరలించారు. జైల్లో వంశీ చిందులు తొక్కుతున్నారు.

Vallabhaneni Vamsi: జైల్లో వల్లభనేని వంశీ చిందులు.. పోలీసులు సీరియస్
Vallabhaneni Vamsi

అమరావతి: వైసీపీ కీలక నేత (YSRCP leader), మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi arrest) అరెస్ట్ కేసులో (Arrest Case) కీలక పరిణామాలు (Key Developments) చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుతం వంశీ విజయవాడ జిల్లా జైల్లో ఉన్నారు. ఈ కేసులో మరికొంతమంది కీలక నిందితులు అరెస్ట్ కావాల్సి ఉందని పోలీసులు తెలిపారు. జైల్లో వల్లభనేని వంశీ చిందులు తొక్కుతున్నారు. తనకు నడుం నొప్పి ఉందని మంచం కావాలని పట్టుబట్టారు. ఈ విషయంలో జైలు అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారు. వంశీని పరీక్షించి అవసరం లేదని జైలు వైద్యులు చెప్పారు. తనకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని వంశీ తెలిపారు.


ఏ సమస్య ఉన్నా వైద్యులకు చూపిస్తామని జైలు అధికారులు చెప్పారు. ఏ సదుపాయం కావాలన్నా, ఎలాంటి సమస్య ఉన్నా కోర్టులో పిటిషన్ వేసుకోవాలని జైల్ అధికారులు సూచించారు. అంతకుముందు కోర్టు హాల్ వద్ద కూడా వంశీ శాపనార్థాలు పెట్టారు. తనపై కేసు పెట్టిన వారు మట్టి కొట్టుకుపోతారని వంశీ వ్యాఖ్యానించారు. అంతకుముందు హైదరాబాద్ నుంచి తీసుకువచ్చే సమయంలో కూడా పోలీసులుతో వంశీ అదే వైఖరిని వ్యవహారించారు. తనను పోలీస్ అధికారులు పట్టుకునేందుకు ప్రయత్నించగా వంశీ విసురుకున్నారు. వచ్చే సమయంలో వాహనంలో కూడా కామెంట్లు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎవరినీ వదిలిపెట్టబోనని పోలీసులపై సీరియస్ అయ్యారు. తనపై కేసు పెట్టించిన వారు ఎవరో తనకు తెలుసు అంటూ, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే సంగతి తెలుస్తానంటూ వంశీ వ్యాఖ్యలు చేశారు. వంశీ కామెంట్లు, చిందులు, శాపనార్థాలపై పోలీసు అధికారులు చర్చించుకుంటున్నారు.


కీలక ఆధారాలు

కాగా, గన్నవరం టీడీపీ కార్యాలయం విధ్వంసం కేసులో ఫిర్యాదు దారుడు సత్యవర్ధన్‌ను వల్లభనేని వంశీమోహన్‌ కిడ్నాప్‌ చేశాడు. కీలక ఆధారాలు పోలీసులు సంపాదించారు. కోర్టు కాంప్లెక్స్ వద్దకు సత్యవర్ధన్‌ను తీసుకువచ్చిన వాహనం, అందులో వచ్చిన వారి వివరాలు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా పోలీసులు సేకరించారు. సత్యవర్ధన్‌ను నగరంలో ఎక్కడెక్కడ తిప్పారనే అంశంపై కూడా సాంకేతిక ఆధారాలు సేకరించారు. వంశీ అనుచరులే ఆ రోజు సత్యవర్ధన్‌ను తీసుకువచ్చారని నిర్ధారణకు వచ్చారు. ఈ కేసులో మొత్తం 12 మంది నిందితులు ఉండటంతో మిగతా వారి కోసం పోలీస్ ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. గన్నవరం, విజయవాడలో వంశీ అనుచరులపై పోలీసులు డేగ కన్ను వేశారు. కాగా తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు ఇప్పటికే ప్రకటించారు.

వంశీమోహన్‌కు 14 రోజులు రిమాండ్...

వల్లభనేని వంశీమోహన్‌కు విజయవాడ అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో వంశీని పోలీసులు విజయవాడ హనుమాన్ పేటలోని జిల్లా జైలుకు తరలించారు. జిల్లా కారాగారంలో 14 రోజుల పాటు (ఈనెల 27 వరకు) రిమాండ్ ఖైదీగా వంశీ ఉండనున్నారు. రిమాండ్ ఖైదీగా ఆయనకు నెంబర్ కేటాయించి అధికారులు జైలు గదిలోకి పంపారు. వల్లభనేని వంశీమోహన్‌‌ను జైలుకు తీసుకువచ్చే ముందు సూర్యారావుపేట పోలీస్ స్టేషన్‌లో పోలీసులు వేలి ముద్రలు, ఐరీష్ తీసుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

CM Chandrababu : నేరుగా అర్జీదారుల వద్దకే!

Transgender Welfare: రాష్ట్ర ట్రాన్స్‌జెండర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు

Nimmala Ramanaidu : ఆ ట్వీట్‌ జగన్‌ నేర స్వభావాన్ని చాటుతోంది

Read Latest AP News and Telugu News

Updated Date - Feb 15 , 2025 | 08:41 AM