Share News

డీఈవో కార్యాలయంలో ప్రక్షాళన

ABN , Publish Date - Apr 16 , 2025 | 02:20 AM

జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో ప్రక్షాళనకు డీఈవో కిరణ్‌కుమార్‌ శ్రీకారం చుట్టారు. వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బందికి పనిభారం తగ్గించి ఉపాధ్యాయులకు మెరుగైన సేవలు అందించేందుకు వీలుగా పలువురికి స్థానచలనం కల్పించారు.

డీఈవో కార్యాలయంలో ప్రక్షాళన
ఒంగోలు ప్రకాశం భవన్‌లోని డీఈవో కార్యాలయం

పలువురు ఉద్యోగులకు స్థానచలనం

ఒంగోలు విద్య, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి) : జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో ప్రక్షాళనకు డీఈవో కిరణ్‌కుమార్‌ శ్రీకారం చుట్టారు. వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బందికి పనిభారం తగ్గించి ఉపాధ్యాయులకు మెరుగైన సేవలు అందించేందుకు వీలుగా పలువురికి స్థానచలనం కల్పించారు. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏ సెక్షన్‌లో ఏ-2గా షేక్‌ అల్లావలి, ఏ-3గా రమణయ్య, ఏ-4గా సిహెచ్‌.నవ్య, ఏ-7గా పి.స్టీవెన్‌సన్‌, బీసెక్షన్‌లో బీ-2గా కేవీ నాగార్జునరెడ్డి, బీ-4గా షేక్‌ మదార్‌బీ, బీ-5గా మల్లికార్జునరావును నియమించారు. సీసెక్షన్‌లో సీ-5గా నవ్యరోహిణి, సీ-6గా బి.శాంతికుమార్‌, అవుట్‌ వర్క్‌లో బి.బాలగురవయ్య, బి.సుబ్బారాయుడును నియమించారు. వీరంతా పాత స్థానాల్లో పూర్తి చార్జిని అప్పగించి వెంటనే కొత్త స్థానాల్లో బాధ్యతలు స్వీకరించాలని ఆ ఉత్తర్వుల్లో డీఈవో ఆదేశించారు.

Updated Date - Apr 16 , 2025 | 02:20 AM