మహిళల రక్షణకే ‘శక్తి’
ABN , Publish Date - Mar 16 , 2025 | 12:18 AM
మ హిళల రక్షణకే శక్తి బృందాలు ఏర్పాటు చేసిన ట్టు ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అన్నారు. మహి ళల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందుబాటులోకి తీసుకొచ్చిన శక్తి బృందాలకు కేటాయించిన 15 పెట్రోలింగ్ వాహనాలను శని వారం సాయంత్రం జిల్లా పోలీసు కార్యాలయం లో ఎస్పీ ప్రారంభించి మాట్లాడారు.

ఎస్పీ మహేశ్వరరెడ్డి
పెట్రోలింగ్ వాహనాలు ప్రారంభం
శ్రీకాకుళంక్రెం, మార్చి 15(ఆంధ్రజ్యోతి): మ హిళల రక్షణకే శక్తి బృందాలు ఏర్పాటు చేసిన ట్టు ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అన్నారు. మహి ళల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందుబాటులోకి తీసుకొచ్చిన శక్తి బృందాలకు కేటాయించిన 15 పెట్రోలింగ్ వాహనాలను శని వారం సాయంత్రం జిల్లా పోలీసు కార్యాలయం లో ఎస్పీ ప్రారంభించి మాట్లాడారు. మహిళలు, చిన్నారుల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా శక్తి యాప్ను రూపొందించింద న్నారు. ఈ యాప్ను గూగుల్ ప్లే స్టోర్లో ప్రతీ మహిళ, చిన్నారులు డౌన్లోడ్ చేసుకుని తమ వివరాలను రిజిస్ర్టేషన్ చేసుకుని తమకు సం బంధించిన రెండు ఫోన్ నెంబర్లను లింక్ చేసు కోవాలన్నారు. మహిళలు ఆపదలో ఉన్నప్పుడు ఈ యాప్లో ఉన్న ఎస్ఓఎస్ ద్వా రా కంట్రోల్ రూమ్కి సమాచారం వెళ్తుందని, 10నిమిషాల్లో శక్తి బృందా లు చేరుకుని రక్షణ కల్పిస్తాయన్నా రు. జిల్లాలో ఐదు బృందాలు పని చేస్తాయన్నారు. కార్యక్రమంలో ఏఎ స్పీ కేవీ రమణ, డీఎస్పీలు సీ.హెచ్ వివేకానంద, సీఐలు కె.పైడపునాయు డు, పి.ఈశ్వరరావు, ఎం.అవతారం, ప్రసాదరావు, సత్యనారాయణ, త్రినేత్రి, ఆర్ఐ నర్సింగరావు, మహిళ ఎస్ఐలు ప్రవల్లిక, హైమావతి, స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.