Crime News: ఏపీలో వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదాలు.. ఐదుగురి మృతి
ABN , Publish Date - Mar 06 , 2025 | 08:13 AM
ఏపీలో గురువారం తెల్లవారు జామున రెండు వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ఘటనల్లో ఐదుగురు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం (Andhra Pradesh)లో గురువారం తెల్లవారుజామున రెండు వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదాలు (Road Accidents) జరిగాయి. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు (Police) ఆయా సంఘటన ప్రదేశాలకు చేరుకుని మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ వార్త కూడా చదవండి..
ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..
విశాఖలో రోడ్డు ప్రమాదం..
విశాఖ కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనం చెట్టును ఢీ కొంది. ఈ ఘటనలో బైక్పై ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. రైల్వే న్యూ కాలనీ నుండి కంచరపాలెం వెళుతున్న మార్గమధ్యంలో ఈ ప్రమాదం జరిగింది. సంఘటన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు మృత దేహాలను కేజీహెచ్ ఆస్పత్రికి తరలించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఏలూరులో రోడ్డు ప్రమాదం..
ఏలూరు సమీపంలోని చొదిమెళ్ల వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. లారీ, ప్రవేటు ట్రావెల్ బస్సు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. 20 మందికి గాయాలు అయ్యాయి. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బస్సు హైదరాబాద్ నుంచి కాకినాడ వెళుతుండగా ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని క్షతగాత్రులు ఏలూరు ఆసుపత్రికి తరలించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
14.2 కిలోల బంగారం నడుముకు కట్టుకుని..
‘ఢిల్లీ’ని మించి జగన్ అవినీతి
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News