16.1 కిలోల గంజాయి స్వాధీనం
ABN , Publish Date - Apr 05 , 2025 | 12:14 AM
మండలంలోని కోమటిపల్లి రోడ్డు జంక్ష న్లో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా 16.1 కిలోల గంజాయి పట్టుబడిందని ఎస్ఐ ఆర్.జయంతి తెలిపారు.

దత్తిరాజేరు, ఏప్రిల్ 4(ఆంధ్రజ్యోతి): మండలంలోని కోమటిపల్లి రోడ్డు జంక్ష న్లో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా 16.1 కిలోల గంజాయి పట్టుబడిం దని ఎస్ఐ ఆర్.జయంతి తెలిపారు. గంజాయి తరలిస్తున్న ఐదుగురు వ్యక్తు లను అదుపులోకి తీసుకున్నామన్నారు. గర్భాం వైపు నుంచి కోమటిపల్లి వైపు ఆటోలో ఐదుగురు వ్యక్తులు 16.1 కిలో గంజాయిని నాలుగు బ్యాగులలో తర లిస్తున్నట్టు గుర్తించి దాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులు తప్పిం చుకునేందుకు యత్నించగా వెంబడించి అదుపులోకి తీసుకు న్నామన్నారు. నిందితుల్లో ముగ్గురు ఒడిశా రాష్ట్రం కొరాపుట్ జిల్లా కురియలపాడు గ్రామా నికి చెందిన జన్ని అప్పన్న, మజ్జి అప్పారావు, జన్ని అప్ప న్న, ఇద్దరు రాజ స్థాన్ రాష్ట్రం జాలోర్ జిల్లా దాదార్ గ్రామానికి చెందిన సురేష్కుమార్ పురో హిత్, గోపాల్ పురోహిత్గా గుర్తించామన్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు.