Water Shed Director : 2023-24 ‘జలకళ’ బోర్ల తనిఖీలకు ఆదేశాలు
ABN , Publish Date - Feb 04 , 2025 | 04:39 AM
తవ్విన బోరుబావులపై తనిఖీలు నిర్వహించాలని వాటర్షెడ్ డైరెక్టర్ షణ్ముఖ్కుమార్ క్వా లిటీ కంట్రోల్ అధికారులను ఆదేశించారు.

అమరావతి, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ జలకళ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 2023-24లో తవ్విన బోరుబావులపై తనిఖీలు నిర్వహించాలని వాటర్షెడ్ డైరెక్టర్ షణ్ముఖ్కుమార్ క్వా లిటీ కంట్రోల్ అధికారులను ఆదేశించారు. 2013 డిసెంబరు 1 నుంచి 2024 నవంబరు 30 వరకు తవ్విన బోరుబావులన్నీ తనిఖీలు చేయాలని సూచించారు. ఎన్నికల ముందు వైసీపీ కార్యకర్తలు బోరుబావులు తవ్వకుండానే బిల్లులు డ్రా చేసుకున్నట్లు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో 100శాతం తనిఖీలు చేయాలని ఆదేశించినట్లు సమాచారం.