Share News

Online Rummy: రూ.50 లక్షలు పోగొట్టుకొని.. చివరకు విగతజీవిగా..

ABN , Publish Date - Apr 04 , 2025 | 12:28 PM

ఆన్‌లైన్‌ రమ్మీకి మరోకరు బలయ్యారు. ఈ ఆన్‌లైన్‌ రమ్మీ పుణ్యమాని ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతూనే ఉంది. వేలూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఈ ఆన్‌లైన్‌ రమ్మీలో రూ.50 లక్షలు పోగొట్టుకున్నాడు. ఆర్ధికంగా చితికిపోయిన ఆయన మనోధైర్యం కోల్పోయి చివరకు తనువు చాలించాడు.

Online Rummy: రూ.50 లక్షలు పోగొట్టుకొని.. చివరకు విగతజీవిగా..

- మరొకరిని బలిగొన్న ఆన్‌లైన్‌ రమ్మీ

- రూ.50 లక్షలు నష్టం

- యువకుడి ఆత్మహత్య

చెన్నై: ఆన్‌లైన్‌ రమ్మీ(Online Rummy) గేమ్‌లో నగదు కోల్పోయిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వేలూరు జిల్లా కేవీ.కుప్పం ప్రాంతానికి చెందిన కార్తిక్‌ (37) అదే ప్రాంతంలోని ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. కొద్ది నెలలుగా ఆన్‌లైన్‌ రమ్మీకి అలవాటు పడిన కార్తిక్‌, సుమారు రూ.50 లక్షలు బెట్టింగ్‌లో పెట్టి ఓడిపోయినట్లు తెలిసింది. అలాగే, మరో రూ.2 లక్షలు కావాలని తల్లిదండ్రులను ఒత్తిడి చేశాడు.

ఈ వార్తను కూడా చదవండి: Chief Minister: చెన్నైలో కార్ల్‌ మార్క్స్‌ విగ్రహం


nani4.2.jpg

ఈ క్రమంలో తెలిసిన వారిదగ్గర, బంధువుల వద్ద పెద్దమొత్తంలో అప్పులు చేసి, అవి తీర్చలేని పరిస్థితుల్లో గురువారం ఉదయం తన ఇంట్లో ఎవరిలేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలిసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, కార్తీక్‌(Kartik) మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి, దీనిపై విచారణ చేపట్టనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

2000 ఎకరాల్లో ప్రపంచస్థాయి ఎకో పార్క్‌!

మా ఆదేశాలు పాటించకపోతే.. సీఎస్‌ జైలుకే!

అకాల వర్షంతో అతలాకుతలం

రెయిన్ అలర్ట్.. మరో రెండు గంటలపాటు..

Read Latest Telangana News and National News

Updated Date - Apr 04 , 2025 | 12:28 PM