Firecracker Explosion: 29 మంది మృతి.. 9 మందికి గాయాలు
ABN , Publish Date - Apr 02 , 2025 | 05:23 AM
గుజరాత్ మరియు పశ్చిమ బెంగాల్ లో రెండు వేర్వేరు బాణసంచా ప్రమాదాల్లో 29 మంది మృతి చెందగా, 9 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. గుజరాత్ లో బాయిలర్ పేలుటతో 21 మంది మరణించగా, పశ్చిమ బెంగాల్ లో బాణసంచా గోదాంలో పేలుడు జరిగింది

పాలన్పూర్/కోల్కతా, ఏప్రిల్ 1: గుజరాత్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో జరిగిన రెండు వేర్వేరు బాణసంచా ప్రమాదాల్లో 29 మంది మృతిచెందారు. 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. గుజరాత్లోని బనస్కాంత జిల్లా దీసా పారిశ్రామిక ప్రాంతంలోని ఓ బాణసంచా గోదాంలో బాయిలర్ పేలి భారీగా మంటలు చెలరేగాయి. మంగళవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో 21 మంది మృతిచెందగా.. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారంతా మధ్యప్రదేశ్కు చెందిన వారని ఎస్పీ అక్షయరాజ్ మక్వానా తెలిపారు. గుజరాత్ సీఎం భూపేంద్ర మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల ఆర్థిక సాయం ప్రకటించారు. మరో ఘటన పశ్చిమ బెంగాల్ దక్షిణ 24 పరగణా జిల్లాలో జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు పిల్లలు సహా ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మరణించగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. పత్తర్ ప్రతిమా ప్రాంతంలోని చంద్రకాంత్ బెనిక్ అనే వ్యక్తికి చెందిన బాణసంచా కర్మాగారంలో సోమవారం రాత్రి ఈ పేలుడు సంభవించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
Husband Marries Wife to Lover: మళ్లీ మొదటి భర్త వద్దకు..
Horoscope 2025-2026: Horoscope 2025-2026: కొత్త సంవత్సరంలో మీ జాతక చక్రం ఎలా తిరగబోతుందో చూసుకోండి
Sri Rama Navami: Sri Rama Navami: శ్రీరామనవమి రోజు.. ఇలా చేయండి.. చాలు
Bengaluru Teacher: విద్యార్థి తండ్రితో అక్రమ సంబంధం.. టీచర్ అరెస్ట్
For Latest National News , National News in Telugu