Share News

Tamil Nadu: ఇంటర్‌ విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టా్‌పలు

ABN , Publish Date - Mar 15 , 2025 | 05:10 AM

శుక్రవారం ఉదయం అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన రాష్ట్ర ఆర్థికమంత్రి తంగం తెన్నరసు ఈమేరకు ప్రకటించారు. అదేవిధంగా తల్లిదండ్రులు లేని పిల్లలకు 18 ఏళ్లు నిండేవరకు ప్రతి నెలా రూ. 2 వేలు అందించనున్నట్టు ప్రకటించారు.

Tamil Nadu: ఇంటర్‌ విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టా్‌పలు

కచ్చితంగా ద్విభాషా విధానం అమలు

తమిళనాడు ఆర్థిక మంత్రి తెన్నరసు

చెన్నై, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): తమిళనాడు వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్లస్‌ టూ(ఇంటర్‌) చదివే విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టా్‌పలు లేదా ట్యాబ్‌లు అందజేయనున్నట్టు స్టాలిన్‌ ప్రభుత్వం ప్రకటించింది. శుక్రవారం ఉదయం అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన రాష్ట్ర ఆర్థికమంత్రి తంగం తెన్నరసు ఈమేరకు ప్రకటించారు. అదేవిధంగా తల్లిదండ్రులు లేని పిల్లలకు 18 ఏళ్లు నిండేవరకు ప్రతి నెలా రూ. 2 వేలు అందించనున్నట్టు ప్రకటించారు. చెన్నై సమీపంలో 2 వేల ఎకరాల్లో కొత్త నగరం కడతామని, సుప్రసిద్ధ ఆధ్యాత్మిక నగరమైన రామేశ్వరంలో విమానాశ్రయం నిర్మించేందుకు చర్యలు చేపడతామని పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాల్లో ‘కలైంజర్‌ కనవు ఇల్లమ్‌ పథకం’ కింద రూ.3500 కోట్లతో లక్ష గృహాల నిర్మాణం చేపట్టనున్నట్టు ప్రకటించారు. తమిళ ‘తిరుక్కురళ్‌’ను 45 భాషల్లోకి అనువదించనున్నట్టు ప్రకటించిన మంత్రి.. కేంద్రప్రభుత్వం ఇవ్వబోమని చెప్పిన నిధులను రాష్ట్ర ప్రభుత్వమే సమకూర్చుకుంటుందని, ఖచ్చితంగా ద్విభాషా విధానాన్నే అమలు చేస్తుందని కూడా తేల్చిచెప్పారు. ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో చదివే 1-5 విద్యార్థులకు అల్పాహార పథకాన్ని ఇప్పటి వరకు చెన్నై, తిరువళ్లూరు జిల్లాల్లో అమలు చేస్తుండగా...ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించనున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం ప్రభుత్వపాఠశాలల్లో ప్లస్‌-2 దాకా చదివి ఉన్నత విద్యా కోర్సుల్లో చేరే విద్యార్థినులకు ప్రతినెలా రూ.1000 చెల్లించే పుదుమైపెణ్‌, విద్యార్థులకు ఆర్థికసాయం అందించే తమిళ్‌పుదల్వన్‌ పథకాలను హిజ్రాలకు కూడా విస్తరింపజేయనున్నామని మంత్రి చెప్పారు.


ఇవి కూడా చదవండి..

Pawan Kalyan: స్టేట్ అయినా.. సెంట్రల్ అయినా.. ఆయన క్రేజే వేరు..

Putin - Modi ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణపై పుతిన్ కీలక వ్యాఖ్యలు.. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 15 , 2025 | 05:10 AM