Share News

నితీశ్‌కు లైన్‌క్లియర్‌

ABN , Publish Date - Mar 16 , 2025 | 04:18 AM

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అభిమానులకు శుభవార్త. ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌ సందర్భంగా..

నితీశ్‌కు లైన్‌క్లియర్‌

బెంగళూరు: ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అభిమానులకు శుభవార్త. ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌ సందర్భంగా నితీశ్‌ పక్కటెముకలనొప్పికి గురైన సంగతి తెలిసిందే. అయితే, నితీశ్‌ తాజాగా జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) నుంచి ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ పొందినట్టు సమాచారం. యోయో టెస్టు కూడా అతను పాస్‌ అయ్యాడట. దీంతో ఐపీఎల్‌లో ఆడేందుకు నితీశ్‌కు మార్గం సుగమమైంది. ఈ ఆంధ్ర క్రికెటర్‌ త్వరలోనే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుతో చేరనున్నాడు.

ఇవీ చదవండి:

కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన అయ్యర్

సన్‌రైజర్స్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ న్యూస్

బుమ్రాపై ఆసీస్ లెజెండ్ సీరియస్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 16 , 2025 | 04:18 AM