గూడెంగుట్టలో వైభవంగా పౌర్ణమి జాతర
ABN , Publish Date - Mar 14 , 2025 | 11:42 PM
మండలంలోని శ్రీసత్యనారాయణస్వామి దేవాలయంలో శుక్రవారం వైభవంగా పార్ణమి జాతర జరిగింది. ఉదయం నుంచే గూడెంలో వేలాది మంది భక్తు లు తరలివచ్చి భక్తి శ్రద్ధలతో స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

దండేపల్లి, మార్చి14 (ఆంధ్రజ్యోతి): మండలంలోని శ్రీసత్యనారాయణస్వామి దేవాలయంలో శుక్రవారం వైభవంగా పార్ణమి జాతర జరిగింది. ఉదయం నుంచే గూడెంలో వేలాది మంది భక్తు లు తరలివచ్చి భక్తి శ్రద్ధలతో స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భ క్తులు ఆల య సమీపంలోని పవిత్ర గోదావరినదిలో పుణ్య స్నానాలు ఆచరించి గంగమ్మ తల్లికి ప్రత్యేక పూ జలు చేశారు. ఆలయానికి చేరుకొని సత్యదేవుడిని దర్శించుకొని భక్తులు అభిషేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు కుటుంబసమేతంగా సత్యనారాయణ స్వామి వ్రతాలను నోముకున్నారు. వచ్చిన భక్తులకు దేవస్థానం ఆధ్వర్యంలో అన్నదానం, స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేసినట్లు ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్ తెలిపారు.