Home » LATEST NEWS
నేడు 20-04-2025, ఆదివారం, ఈ రాశి వారికి శుభయోగం అంతా అనుకూలంగా ఉంటుంది
అమరావతిని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసే లక్ష్యంతో సీఆర్డీయే పనిచేస్తోందని, రాజధానిలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసేలా డీపీఆర్ సిద్ధం చేస్తున్నామని, గ్రామాల్లో సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని సీఆర్డీయే కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు.
సిటీ సివిల్ కోర్టుల ముందు శనివారం మధ్యాహ్నం మండుటెండలో యువ మహిళా న్యాయవాది తుమ్మూరు మణిప్రియ నిరసన దీక్ష చేపట్టారు.
సమస్యలపై నివేదిక ఇవ్వాలని పలాస నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త యార్లగడ్డ వెంకన్న చౌదరి కోరారు. శనివారం పలాస టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ అభివృద్ధి, సమస్యలు, పరిష్కారమార్గాలపై రౌండ్ టేబుల్ సమావేశం బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులతో నిర్వహించారు.
పదిహేనేళ్ల వయసులోనే స్కేటింగ్లో ప్రతిభ కనబరిచి, జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధిస్తూ తన జైత్రయాత్ర కొనసాగిస్తోంది నగరానికి చెందిన చైత్రదీపిక. రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ ఆఫ్ కృష్ణా డిస్ట్రిక్ట్ ద్వారా నగరపాలక సంస్థకు చెందిన ఇండోర్ స్టేడియంలో సాధన చేస్తూ ఇప్పటి వరకు రాష్ట్రస్థాయి నుంచి ప్రపంచ స్థాయి వరకు అనేక టోర్నీలు, చాంపియన్ షిప్లలో 47 పతకాలు (16 పసిడి, 16 రజత, 15 కాంస్య) సాధించి అందరితో ఔరా అనిపించింది.
ఉత్తర తెలంగాణలో కరీంనగర్ను స్మార్ట్ సిటిగా అభివృద్ధి పరచడమే కాకుండా పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని ప్రభుత్వం, అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. ముఖ్యమంత్రి హామీ పద్దు కింద చేపట్టిన పనులకే మోక్షం లేకుండా పోయి వెక్కిరిస్తున్నాయి.
ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఎండు మిర్చి ధరలు భారీగా పతనమయ్యాయి.
రాజధాని ప్రాంతంలో గత ఐదేళ్లూ పడకేసిన నిర్మాణ పనులు కూటమి ప్రభుత్వమొ చ్చాక బాగా ఊపందుకున్నాయి. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం, మరోవైపు ఆర్థిక సంస్థలు రుణాలు ఇస్తుండటంతో రోడ్లు, భవనాల పనులు చురుకుగా జరుగుతున్నాయి. కొత్త పనులకు టెండర్లు పిలుస్తూ, ప్రభుత్వం చకాచకా కాంట్రాక్టర్లను ఎంపిక చేస్తోంది. పలు బడా నిర్మాణ సంస్థలు భారీ యంత్రాలు, వేలాది కార్మికులతో పనులు చేస్తుండటంతో ఇసుక, సిమెంట్తో పాటుగా కోట్లాది మెట్రిక్ టన్నుల కంకర అవసరమవుతోంది. ఎన్టీఆర్ జిల్లాలో పరిటాల, గుంటూరు జిల్లాలో పేరేచర్ల ప్రాంతాల్లో నిర్మాణపరంగా నాణ్యతగల కంకర దొరుకుతుంది. పేరేచర్ల ప్రాంతంలో కంకర నాలుగైదేళ్లకు మించి దొరకదు. పరిటాల ప్రాంతంలో రెండు మూడు దశాబ్దాల వరకు మైనింగ్కు ఢోకా లేదు. దీంతో ఇక్కడి కంకర, రోడ్డు మెటల్కు సమీప భవిష్యత్తులో ఇంకా గిరాకీ పెరగనున్నది. పరిటాల ప్రాంతంలో రోజుకు రెండు వందల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన భారీ క్రషర్లు పదుల సంఖ్యలో ఉన్నాయి. అమరావతి పుణ్యమా అని మెటల్ మైనింగ్కు ఇక మహర్దశ పట్టనున్నది.
ఉమ్మడి జిల్లా ప్రగతిలో చంద్రబాబు
జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయాల్లో ఖాళీలు వెక్కిరిస్తున్నాయి. రైతులు పండించిన ఉత్పత్తులను సేకరించే వ్యవసాయ మార్కెట్లపై పర్యవేక్షణ కొరవడింది. జిల్లాలోని ప్రధాన మార్కెట్లు సైతం ఇన్చార్జీల పాలనలో కొనసాగుతున్నాయి. ఒక్కో సెక్రెటరీకి మూడు, నాలుగు మార్కెట్ల బాధ్యతలు అప్పగించడంతో పని ఒత్తిడితో సతమతం అవుతున్నారు.
చిత్తూరు జిల్లా కుప్పంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ పుట్టిన రోజు సందర్భంగా వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు.
హైదరాబాద్లో హైటెక్ సిటీని కేవలం 13 నెలల్లో నిర్మించాలని సంకల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ పనిని అనుకున్న సమయంలో పూర్తి చేయించగలిగారు. ప్రజాల శ్రేయస్సే లక్ష్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని విజన్ 2020 పేరుతో ఇరవై ఏళ్ల భవిష్యత్తుకు ప్రణాళికను సిద్ధం చేశారు.
ఇటీవల కాలంలో దేశంలో పసిడి ధరలు పైపైకి చేరుతున్నాయి. వీటి ధరలు దాదాపు లక్షకు చేరువయ్యాయి. దీంతో వీటిని సామాన్యులు కొనుగోలు చేయాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలు మన దేశ ఆర్బీఐ వద్ద ఎంత గోల్డ్ నిల్వలు ఉన్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
Natural Remedies to Dissolve Kidney Stones: కిడ్నీలో రాళ్లు ఏర్పడే సమస్య ఉంటే మందులు లేదా సర్జరీలే దిక్కు బాధితులకు. ఎన్నిసార్లు చికిత్స చేయించుకున్నా సమస్య తిరగబెట్టదనే గ్యారెంటీ లేదు. ఖర్చులు భరించే స్థోమత లేకపోతే వారికి ఈ జ్యూస్ అమృతమే. ఎందుకంటే ఇది తాగితే కిడ్నీలో రాళ్లు ఐస్ లాగా కరిగిపోతాయి మరి.
Tips For Instant Knee Pain Relief: ఓ వయసు రాగానే మోకాళ్ల నొప్పులు వేధిస్తుంటాయి. అడుగు తీసి అడుగు పెట్టాలన్నా విపరీతమైన నొప్పి ఉంటుంది. ఈ దివ్యౌధం వాడారంటే మాత్రం ఆ వేదనకు తక్షణమే టాటా చెప్పేయొచ్చు.
గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఐఏఎస్ స్మితా సబర్వాల్ విచారణకు హాజరైయ్యారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి సంబంధించిన ఏఐ ఫొటోను తన ఎక్స్ ఖాతాలో రీపోస్ట్ చేయడంతో పోలీసులు ఆమెకు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమె విచారణకు హాజరై పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చారు.
Director Anurag Kashyap Apologizes: ఆయన బ్రాహ్మణులపై చేసిన కామెంట్లు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలోనే ఆయనకు బెదిరింపులు వచ్చాయి. దీంతో ఆయన వెనక్కు తగ్గాయి. శుక్రవారం బ్రాహ్మణులకు క్షమాపణ చెప్పారు.
Delhi Tragedy: ఢిల్లీలో ఘోర ప్రమాదం జరిగింది. ఆరు అంతస్థుల భవనం కుప్పకూలడంతో నలుగురు మృత్యువాత పడ్డారు.
Raj Kasireddy: లిక్కర్ స్కాంలో నిందితుడు రాజ్ కసిరెడ్డి మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ పిటిషన్ వేశారు.
సిద్దిపేట పట్టణంలోని మెట్రో గార్డెన్లో స్కూల్ విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో చిన్నారులు తమ సమస్యలను చెప్పుకున్నారు. ఈ సందర్భంగా ఓ చిన్నారి బాధను విని మాజీ మంత్రి హరీష్రావు కంట కన్నీరు పెట్టుకున్నారు.
హైదరాబాద్ మెట్రో యాజమాన్యం మెట్రో ప్రయాణికులకు బిగ్ షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రతి ఏడాది నష్టాలు పెరుగుతుండటంతో కీలక నిర్ణయం తీసుకునేందుకు రెడీ అవుతోంది.
ఎన్టీఆర్ జిల్లా నందిగామ రైతుపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కొంతమంది దుండగులు దాడి చేశారు. కార్యాలయంలో ఎవరూ లేని సమయంలో రాళ్లు విసిరారు. దీంతో కిటీకీ అద్దాలు ధ్వంసమయ్యాయి.
తిరుపతిలోని తిరుచానూరు ఆలయం వద్ద శనివారం నాడు భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అగ్ని ప్రమాదం జరగడంతో మంటలు దట్టంగా వ్యాపించాయి. ఆలయం నుంచి నెయ్యి వ్యర్థాలు వచ్చే కాల్వ వద్ద కొంతమంది దుండగులు నిప్పు పెట్టారు.
భక్తులు దేవుడిని ఏదైనా కోరిక కోరుకోవడం, ఆ కోరిక తీరితే కానుకలు ఇస్తానని మొక్కుకోవడం సనాతన సంప్రదాయంలో పరిపాటి. కోరికలు తీరగానే భక్తులు తమ తాహతుకు తగిన విధంగా కానుకలు ఇస్తుంటారు. వాటిలో బంగారు అభరణాలు కూడా ఉంటాయి.
గుంటూరు జిల్లా వెంగళాయపాలెంలోని ఆంధ్రజ్యోతి యూనిట్ ఆఫీస్లో లక్కీ డ్రా నిర్వహించారు. డీజీఎం రామచంద్రరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీవీఐటీ విద్య సంస్థల చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ పాల్గొన్నారు. లక్కీ డ్రా తీసి విజేతలకు బహుమతులు అందజేశారు.ఆంధ్రజ్యోతి పాఠకులకు సంస్థ తరఫున బహుమతులు అందజేయడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. విజేతలకు విద్యాసాగర్ శుభాకాంక్షలు తెలిపారు.
హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి.