Home » ABN
Errabelli Dayakar Rao: రెేవంత్ రెడ్డి సర్కార్పై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పలు నియోజకవర్గాల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. కేవలం 10 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే ఆ పార్టీకి అనుకూల పరిస్థితులు ఉన్నాయని ఆయన చెప్పారు.
PM Modi: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఖరారు అయింది. మే 2వ తేదీన రాజధాని అమరావతికి ప్రధాని మోదీ రానున్నారు. రాజధాని పునర్ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశంలో సీఎం చంద్రబాబు వెల్లడించారు.
ఇందిరామ్మ రాజ్యంలో ఆనాడు అసైన్డ్ భూములు దాదాపు 25 లక్షల ఎకరాలు పేదలకు పంచి పెట్టారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. రూపాయి రూపాయి కూడబెట్టి.. కొద్ది పాటి భూమి కొనుగోలు చేసిన వారు.. తమ భూమి తమది కానదన్నప్పుడు వారు పడే అవేదన అంత ఇంత కాదని ఆయన పేర్కొన్నారు. ఏప్రిల్ 14వ తేదీన తెలంగాణలో భూ భారతి పోర్టల్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ పోర్టల్ను తెలంగాణ ప్రజలకు ఆయన ఆకింతమిచ్చారు.
గత ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పోరేషన్లు మరుగున పడ్డాయని.. కూటమి ప్రభుత్వంలో తిరిగి అవి జీవం పోసుకొంటున్నాయని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద రావు పేర్కొన్నారు. తిరుపతి సమీపంలో సంస్కృత విద్యా పీఠంలో జరిగిన అంబేద్కర్ జయంతిలో ఆయన పాల్గొన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందంటూ ఆయన మండిపడ్డారు.
gutkha khaini : గుట్కా, ఖైనీ తినే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. అదే స్థాయిలో అనారోగ్యానికి గరవుతున్న వారు సైతం పెరుగుతోన్నారు. వీటిలో వాడే పదార్థాలు సైతం ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. అంతేకాదు..వివిధ రకాల క్యాన్సర్ల బారిన పడుతోన్న వారి సంఖ్య భారీగా పెరిగింది.
UPI Transactions: నోట్ల రద్దు అనంతరం దేశంలో డిజిటల్ లావాదేవీలు ఊపందుకొన్నాయి. ఈ విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ యూపీఐ లావాదేవీల్లో 12 అంకెల సంఖ్య ప్రముఖంగా కనిపిస్తుంది. ఈ 12 అంకెల సంఖ్య వెనుక ఉన్న అర్థం పరమార్థం ఏమిటంటే..
Kancha Gachibowli: కంచ గచ్చిబౌలి భూములపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ భూములు ప్రభుత్వానివేనని స్పష్టం చేసింది. ఈ భూముల వ్యవహారం కోర్టులో ఉండడం వల్ల.. చెట్లు భారీగా పెరిగాయని వివరించింది.
New Delhi: దేశ రాజధాని న్యూఢిల్లీలో నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే విమాన ప్రయాణికులకు ఇండిగో ఎయిర్ లైన్స్ సంస్థ బిగ్ అలర్ట్ ప్రకటించింది. విమానాశ్రయంలోని టెర్మినల్ 2ను మరమ్మతులు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆ టెర్మినల్ నుంచి విమాన సేవలు తాత్కాలికంగా నిలిపివేస్తారని సదరు ఎయిర్ లైన్స్ వెల్లడించింది.
ఏపీ మంత్రి నారా లోకేశ్ మరో హామీని నిలబెట్టుకొన్నారు. పాదయాత్రలో చెప్పినట్లుగా మంగళగిరి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రికి ఆయన ఆదివారం శంకుస్థాపన చేశారు. చిన కాకానిలో ఆయన ఆసుపత్రికి భూమి పూజ చేశారు. ఏడున్నర ఎకరాల్లో ఈ ఆసుపత్రిని నిర్మించనున్నారు. అందుకోసం రూ. 52 కోట్లు ఖర్చు చేయనున్నారు. దేశంలోనే అత్యున్న స్థాయిలో ఈ ఆసుపత్రి ఉండాని లోకేశ్ ఆకాంక్షించారు. ఏడాదిలోపు ఈ ఆసుపత్రి నిర్మాణం పూర్తి కావాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రైవేట్ ఆసుపత్రికి ధీటుగా ఈ 100 పడకల ఆసుపత్రి ఉంటుందన్నారు.
ములుగు జిల్లా ఏటూరి నాగారం మంగపేట మండలంలో వడగండ్ల వర్షం కురిసింది. కాటాపూర్, బీరెల్లి రంగాపూర్లలో వడగండ్ల వర్షం దంచికొట్టింది. ఎండలతో అల్లాడుతోన్న ప్రజలకు ఈ వర్షాలు కాస్తా ఉపశమనం లభించినట్లు అయింది. ఇక అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంతేకాదు.. వర్షం దాటికి తమ పంటలు పోయాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.