Home » Akhilesh Yadav
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేలో చేరే అవకాశాలున్నాయంటూ ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ విభిన్నంగా స్పందించారు. 'ఇండియా' కూటమిలోనే నితీష్ ఉంటే ఆయన ప్రధాన మంత్రి అభ్యర్థి కావొచ్చని వ్యాఖ్యానించారు.
ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ను ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరుకావాలని రామజన్మభూమి ట్రస్ట్ సభ్యులు స్వయంగా ఆహ్వానించారు. ఆ రోజు హాజరుకాలేనని అఖిలేశ్ యాదవ్ స్పష్టంచేశారు.
అయోధ్యలో రామాలయం ప్రాణ్ ప్రతిష్ట కార్యక్రమం 2024 జనవరి 22న జరగనుండటంతో యూపీ ప్రభుత్వం సర్వ సన్నాహాలు చేస్తుండగా, రాష్ట్రంలో ప్రధాన విపక్షమైన సమాజ్వాదీ పార్టీ (Samajwadi party) మాత్రం ఈ అంశంపై ఆచితూచి వ్యవహరిస్తోంది. దీనిపై ఆ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అస్పష్టమైన సమాధానం ఇచ్చారు. దేవుడు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు ఆలయానికి వెళ్తానని ఆయన తెలిపారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ( KCR ) ఆరోగ్య పరిస్థితి గురించి ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ( Akhilesh Yadav ) ఆరా తీశారు. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్కు ఫోన్ చేసి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై పరామర్శించారు.
Telangana: తుంటి ఎముక ఫ్యాక్చర్తో యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఆరా తీశారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చెన్నైలోని ప్రెసిడెన్సీ కాలేజీలో దివంగత మాజీ ప్రధాన మంత్రి వీపీ సింగ్ విగ్రహాన్ని సోమవారంనాడు ఆవిష్కరించారు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సమక్షంలో ఈ విగ్రహావిష్కరణ జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
Cricket: క్రికెట్ ప్రపంచ కప్(Cricket World Cup - 2023) లో భారత్ ఓటమిపై సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్(Akilesh Yadav) యాదవ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
Nitish Kumar: బిహార్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ‘జనాభా నియంత్రణ’ విషయంలో చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో అందరికీ తెలుసు. చదువుకున్న మహిళలకు గర్భం రాకుండా శృంగారం ఎలా చేయాలో తెలుస్తుందంటూ ఆయన చేసిన కామెంట్స్పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
ఇండియా కూటమి(INDIA Alliance) లో రివేంజ్ పాలిటిక్స్ నడుస్తున్నట్లు కనిపిస్తోంది. వచ్చే ఏడాది జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో ఉత్తర్ప్రదేశ్లోని 80 లోక్సభ స్థానాల్లో 65 స్థానాల్లో సమాజ్వాదీ పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ వర్గాలు గురువారం తెలిపాయి. అభ్యర్థుల పేర్లు దాదాపు ఖరారయ్యాయని పార్టీ స్ఫష్టం చేసింది.
'ఇండియా' కూటమిలో భాగస్వామిగా ఉన్న సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ ఇటీవల మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పీడీఏ నినాదం ఎత్తుకున్నారు. దీనిపై అఖిలేష్ తాజా వివరణ ఇచ్చారు. ఇండియా కూటమి ఉంటుందని, పీడీఏ అనేది తమ పార్టీ వ్యూహమని చెప్పారు.