Home » Andhra Pradesh Politics
ఎన్నికల వేళ సంచలనానికి తెరలేపారు వైఎస్ సునీతా రెడ్డి(YS Sunitha). వైఎస్ వివేకా(YS Viveka) హత్య కేసులో న్యాయం చేయాలంటూ ‘జస్టిస్ ఫర్ వివేకా’ పేరుతో ప్రజెంటేషన్ ఇచ్చారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడిన ఆమె.. వివేకానంద రెడ్డి హత్య ఒక రాజకీయ కుట్రగా అభివర్ణించారు. 2009 వైఎస్ఆర్(YSR) మరణం తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలను..
Andhra Pradesh: వై నాట్ 175 అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన వైఎస్ జగన్కు(YS Jagan) వరుస షాక్లు ఇస్తున్నారు సొంత పార్టీ నేతలు. 175 ఏమో గానీ.. అసలు లెక్కలో ఉంటారా? ఉండరా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే ఎంతో మంది నేతలు వైసీపీ(YSRCP) నుంచి ఇతర పార్టీల్లోకి జంప్ అవుతుండగా.. ఇప్పుడు మరికొందరు నేతలు ఆ బాటలో పయనిస్తున్నారు. తాజాగా పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు(MS Babu) వైసీపీకి రాజీనామా చేశారు.
నంద్యాల జిల్లాలో గత నెల ముస్లిం యువకుడి హత్య ఘటన మరువకముందే.. మరో ముస్లిం మహిళపై వైసీపీకి చెందిన దంపతులు తన ప్రతాపాన్ని చూపారు.
‘నా అవ్వా తాతలు’ అంటూ ప్రేమ ఒలకబోసే వైసీపీ అధ్యక్షుడు జగన్కు నిజంగానే వారిపై ప్రేమ ఉందా? పెన్షన్ లబ్ధి జరిగింది ఎవరి హయాంలో? తాజా పరిణామాల నేపథ్యంలో ఇదో చర్చనీయాంశంగా మారింది.
సొంత బాబాయి వైఎస్ వివేకానందరెడ్డిని చంపినవారిని శిక్షించలేని నీవు నాయకుడివి ఎలా అవుతావు?’ అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఆయన సోదరి, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విరుచుకుపడ్డారు.
రాష్ట్రంలో పింఛనుదార్ల మరణాలకు నైతిక బాధ్యత వహిస్తూ జగన్(YS Jagan) వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి(East Godavari) జిల్లా నల్లజర్లలో(Nallajarla) మీడియా సమావేశంలోనూ, పశ్చిమ గోదావరి(West Godavari) జిల్లా నరసాపురం, పాలకొల్లు పట్టణాల్లో నిర్వహించిన ప్రజాగళం యాత్రలోనూ చంద్రబాబు(Chandrababu) మాట్లాడారు.
Andhra Pradesh: ఎంపీ రఘురామకృష్ణం రాజు(Raghu Rama Krishna Raju) మరికాసేపట్లో టీడీపీలో(TDP) చేరనున్నారు. నల్లజర్లలో చంద్రబాబును(Chandrababu) కలిసి.. పార్టీలో చేరనున్నారు. ఈ నేపథ్యంలోనే రఘురామకృష్ణం రాజు భీమవరం(Bhimavaram) నుంచి నల్లజర్ల బయలుదేరారు.
ఏపీలో పాలిటిక్స్(AP Politics) మరింత రసవత్తరంగా సాగుతున్నాయి. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ నేతల మాటలు కోటలు దాటుతున్నాయి. వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. తాజాగా ఇదే అంశంలో.. మాజీ మంత్రి పేర్ని నానికి(Perni Nani) బీజేపీ(BJP) సీనియర్ నాయకుడు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. నోటికొచ్చినట్లు మాట్లాడితే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
ముఖ్యమంత్రి జగన్ తన ప్రసంగంలో పలు అబద్ధాలు చోటుచేసుకున్నాయి. పెన్షన్లు తీసుకునేందుకు వెళ్లి 31మంది వృద్ధులు చనిపోయారని, వారి మరణానికి చంద్రబాబే కారణమని నాయుడుపేట బహిరంగసభలో జగన్ ఆరోపించారు.
‘వలంటీర్లు నా సైన్యం’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి అంగీకరించారు. తిరిగి అధికారంలోకి రాగానే తొలి సంతకం వలంటీర్ల వ్యవస్థకు సంబంధించిన ఫైలుపైనే పెడతానని నాయుడుపేట బహిరంగసభ వేదికగా ప్రకటించారు. ఇన్నాళ్లూ విపక్షాలు చెబుతున్నది కూడా ఇదేకదా అని