Home » Andhra Pradesh Politics
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిపాలైన వైసీపీ(YSRCP) ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు, ముఖ్య నేతలతో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) భేటీ అయ్యారు. 2029లో మళ్లీ వైసీపీనే వస్తుందంటూ వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు జగన్. 2029 వచ్చే నాటికి చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తారని అన్నారు.
CM Chandrababu Naidu Visit Amaravati Live Update: ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి పర్యటన ముగిసింది. అమరావతి పరిధిలో కీలకమైన అన్ని ప్రాంతాలను సీఎం పరిశీలించారు. ఐకానిక్ సెక్రటేరియట్, అసెంబ్లీ, జడ్జిల నివాస సముదాయం, ప్రజాప్రతినిధుల నివాస సముదాయం సహా అన్నింటినీ సీఎం పరిశీలించారు. మరికాసేపట్లో ప్రెస్మీట్లో సీఎం చంద్రబాబు మాట్లాడనున్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వం మారడమే కాదు.. పరిపాలన విభాగంలోనూ సమూల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు ఉన్న జగన్ భజన బ్యాచ్.. బిగ్ షాక్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. జగన్ పాలనా సమయంలో అనేక శాఖల్లో తిష్ట వేసిన రిటైర్డ్ ఉద్యోగులపై స్పెషల్ ఫోకస్ పెట్టింది చంద్రబాబు సర్కార్. ఈ బ్యాచ్ ప్రభుత్వంలో జరుగుతున్న అన్ని విషయాలను జగన్కు చేరవేస్తున్నట్లు తెలుస్తోంది.
ఐదేళ్లపాటు పడావుపడిన అమరావతికి(Amaravati) మళ్లీ పునర్వైభవం రానుంది. రాజధాని రాష్ట్రానికి.. అద్భుతమైన రాజధాని సిద్ధం కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) గురువారం నాడు రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటించనున్నారు.
ఇందుగలదు అందు లేదన్నట్లుగా.. వైసీపీ(YSRCP) ప్రభుత్వం హయాంలో ఏ శాఖలో చూసినా అవినీతే కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో(Andhra Pradesh Government) ప్రభుత్వం మారిన తరువాత గత వైసీపీ ప్రభుత్వ అక్రమాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి.
CM Chandrababu Naidu Vistis Polavaram: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం చేరుకున్నారు. ప్రత్యేక హెలికాప్టర్లో పోలవరం వద్దకు వచ్చిన సీఎం చంద్రబాబు.. ప్రాజెక్టుపై ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం ప్రాజెక్టును నేరుగా సందర్శించారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.
ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. ఆయనకు మధ్యంతర బెయిల్ను తిరస్కరించింది హైకోర్టు ధర్మాసనం. బేవరేజెస్ కార్పొరేషన్లో భారీ అవినీతి జరిగిందని.. కార్పొరేషన్ కార్యాలయం నుంచి ఫైళ్లు తీసుకెళ్లారని వాసుదేవ రెడ్డిపై పలువురు ఫిర్యాదు చేశారు.
Andhra Pradesh News: వైసీపీ నేతలపై ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ వాళ్లు దొంగే దొంగా దొంగా అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. విజయసాయిరెడ్డి ఢిల్లీలో చేసిన కామెంట్స్కు రఘురామకృష్ణం రాజు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తమను కొట్టారని విజయసాయి రెడ్డి ఢిల్లీలో హంగామా చేశారని..
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీ వెంకటేశుని దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. శ్రీవారి ఆశీస్సుల కారణంగానే తమ కూటమి విజయం సాధించిందన్నారు. రాష్ట్ర ప్రజలు చారిత్రాత్మక తీర్పునిచ్చారని.. 93 శాతం స్ట్రైక్ రేట్ గతంలో ఎప్పుడూ రాలేదన్నారు చంద్రబాబు.
AP CM Chandrababu Naidu Swearing in Ceremony Live News Updates: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారానికి సర్వం సిద్ధమైంది. మరికాసేపట్లో ఈ కార్యక్రమం ప్రారంభం కానుండగా.. ప్రమాణ స్వీకార వేడుక కోసం కృష్ణాజిల్లా గన్నవరంలోని కేసరపల్లి గ్రామం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఇరవై ఎకరాల ప్రాంగణంలో మూడు అత్యంత భారీ టెంట్లను ఏర్పాటు చేశారు.