Home » Andhra Pradesh Politics
వాలంటర్లపై టీడీపీ నతే బొజ్జల సుధీర్ రెడ్డి(Bojjala Sudheer Reddy) చేసిన వ్యాఖ్యలపై అచ్చెన్నాయుడు(Kinjarapu Atchannaidu) క్లారిటీ ఇచ్చారు. సుధీర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అని స్పష్టం చేశారు. శ్రీకాళహస్తి(Srikalahasti) నియోజకవర్గంలో మాట్లాడిన బొజ్జల సుధీర్ రెడ్డి వాలంటీర్లపై వివాదాస్పద కామెంట్స్ చేశారు. దీనిపై స్పందించిన అచ్చెన్నాయుడు క్లారిటీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ పోలీసులు(Andhra Pradesh) వ్యవహరిస్తున్న తీరుపై టీడీపీ(TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) ఫైర్ అయ్యారు. ప్రధానంగా డీజీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘డీజీపీకి టైమ్ దగ్గర పడింది’ అంటూ వార్నింగ్ ఇచ్చారు. ప్రతిపక్షాల వాహనాలు మాత్రమే తనిఖీ చేయమని డీజీపీ(AP DGP) ఆదేశాలు ఇచ్చినట్లు కిందిస్థాయి సిబ్బంది చెబుతున్నారన్నారు. పార్టీ అంతర్గత సమావేశంలో..
Andhra Pradesh News: ఓటమి భయమా? మరోంటో తెలియదు గానీ.. విపక్ష నేతలపై వైసీపీ(YCP) సర్కార్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. మూడు రోజుల వ్యవధిలోనే నాలుగు సార్లు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) కాన్వాయ్ని ఆపి చెక్ చేశారు పోలీసులు. ఎలక్షన్ కోడ్(Election Code) అమల్లో భాగంగా ఈ తనిఖీలు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు.
AP Elections 2024: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ముందు అధికార వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే ఒకరు.. బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీ వేదికగా ఈ చేరిక జరిగింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం(Andhra Pradesh) అభివృద్ధి చెందాలంటే సరైన నాయకుడు అవసరం అని, ఆ సరైన నాయకుడు చంద్రబాబేనని(Chandrababu) పేర్కొన్నారు నారా భువనేశ్వరి(Bhuvaneshwari). శనివారం నాడు నెల్లూరు(Nellore) జిల్లాలో నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా మహిళలతో భువనేశ్వరి ప్రత్యేకంగా మాట్లాడారు.
ఎన్డీయే కూటమి ఎమ్మెల్యే(MLA), ఎంపీ(MP) అభ్యర్థులతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) కీలక భేటీ నిర్వహించారు. విజయవాడలోని(Vijayawada) ఏ కన్వెన్షన్లో ఈ వర్క్ షాప్ నడుస్తోంది. అభ్యర్థులతో పాటుగా నియోజకవర్గాల ఇన్చార్జులు కూడా హాజరయ్యారు. జనసేన, బీజేపీ ప్రతినిధులు సైతం హాజరయ్యారు.
Nellore News: ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు(AP Assembly Elections) సమయం దగ్గరపడుతోంది. రాష్ట్రంలో ఈసారి వైసీపీ(YCP) ఓటమి దాదాపు ఖాయం అని ప్రజల్లో గట్టి చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో ఈసారి తాను ఎలాగైనా గెలవాలనే ఉద్దేశ్యంతో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి(Kakani Govardhan Reddy) భారీ కుట్రకు తెరలేపినట్లు తెలుస్తోంది. ఏబీఎన్-ఆంధ్రజ్యోతి పరిశీలనలో అడ్డగోలు నియామకాల వ్యవహారం..
Andhra Pradesh Elections 2024: ఎన్నికలు దగ్గరపడుతున్నా కొద్ది.. వైసీపీ(YSRCP) నాయకులు రోజుకొక డ్రామా క్రియేట్ చేస్తున్నారు. ఎన్డీయే(NDA) కూటమి దెబ్బకు ఓటమి భయంతో అల్లాడిపోతున్న వైసీపీ వర్గం.. ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. తాజాగా సీఎం జగనే(CM J agan) నేరుగా ఎంట్రీ ఇచ్చారు. ప్రజలను ఏమార్చేందుకు బీద అరుపులు అరుస్తున్నారు. రాష్ట్ర ప్రజలందరికీ జగన్ వాయిస్తో మెసేజ్లు పంపుతున్నారు.
AP Elections 2024: రానున్న ఎన్నికల్లో ఓడిపోబోతున్నామనే భయంతో వైసీపీ(YSRCP) మూకలు రెచ్చిపోతున్నాయి. సోషల్ మీడియా(Social Media) వేదికగా తమ పైశాచిక ఆనందాన్ని ప్రదర్శిస్తున్నాయి. బీజేపీ(BJP), టీడీపీ(TDP) లక్ష్యంగా దుష్ప్రచారం ప్రారంభించారు. సోషల్ మీడియా వేదికగా ఈ రెండు పార్టీలకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ, ఎస్టీలు లక్ష్యంగా వైసీపీ శ్రేణులు దాడులకు తెగబడుతున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య మండిపడ్డారు. దళితులను బెదిరించి ఓట్లు దండుకోవాలని వైసీపీ నేతలు చూస్తున్నారని వర్ల రామయ్య ఆరోపించారు. ప్రత్తిపాడులో వాలంటీర్లతో వైసీపీ అభ్యర్థి బాలసాని కిరణ్ కుమార్ సమావేశం కావడం ఎన్నికల కమిషన్ నియమావళికి విరుద్దం అని తెలిపారు. ఆ అంశాన్ని మాజీ ఐఏఎస్, దళితుడు రామాంజనేయులు ప్రశ్నిస్తే దాడికి తెగబడ్డారని వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.