Home » Atchannaidu Kinjarapu
అధిక వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను త్వరితగతిన ఆదుకుంటామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (Minister Atchannaidu) హామీ ఇచ్చారు.
శ్రీకాకుళం జిల్లా పేరు చెప్పగానే గుర్తొచ్చే రాజకీయ నాయకులు కొందరు ఉంటారు. ప్రస్తుత రాజకీయాల్లో మొదట వరుసలో ఉండేది కింజరాపు కుటుంబమైతే.. రెండో వరుసలో ఉండేది ధర్మాన కుటుంబం.
సహకార వ్యవస్థలో ఈ-కేవైసీ అమలు చేసి పారదర్శకంగా సేవలు అందిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు (Minister Atchannaidu) తెలిపారు. ఆప్కాబ్ రాష్ట్ర స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
Andhrapradesh: రాష్ట్ర రైతుల కోసం వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతులకు తక్షణమే రాయితీపై బిందు సేద్యం అందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో రాయితీపై బిందు సేద్యం అమలుపై అధికారులతో మంత్రి అచ్చెన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో తక్షణమే రిజిస్ట్రేషన్ ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు.
తూర్పుగోదావరి జిల్లా: సీతానగరం మండలంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పర్యటించారు. రాపాకలో వరద నీటిలో మునిగిపోయిన పంట పొలాలు, బొబ్బిలి లంకలో ఏటిగట్టున ఆయన పరిశీలించారు. ఉభయ గోదావరి జిల్లాలో పంట నష్టాన్ని అంచనా వేశామని అన్నారు.
ఏపీలో భారీ వర్షాలు పడుతున్నాయి. పలు జిల్లాలు నీట మునిగాయి. అయితే ముంపు ప్రాంతాల్లో మంత్రులు పర్యటించారు. కె.గంగవరం మం. కోటిపల్లి వరద ముంపు ప్రాంతాల్లో మంత్రులు కింజారపు అచ్చెన్నాయుడు, మంగలపూడి అనిత, వాసంశెట్టి సుభాష్ పర్యటించారు.
ఈనెల 23నుంచి "పోలం పిలుస్తోంది"(Polam Pilustondi) కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వ్యవసాయ, పశు సంవర్థక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు(Minister Atchannaidu) తెలిపారు. ఇకపై సాగు విషయంలో రైతులకు శాస్త్రీయ అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా భూసార పరీక్షలు నిర్వహించి వాటి ఆధారంగా ఎరువుల వాడేలా రైతులకు అవగాహన కల్పిస్తామని అచ్చెన్న చెప్పుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రవ్యాప్తంగా పశు పోషకులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్థక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు(Minister Atchannaidu) తెలిపారు. వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలను ప్రోత్సహించడం, గ్రామీణ పేదల జీవనోపాధిని మెరుగుపరిచేందుకు ఎన్డీయే ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.
ప్రకృతి వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (Minister Atchannaidu) తెలిపారు. 60 లక్షల మంది రైతులతో ప్రకృతి వ్యవసాయం చేస్తామని అన్నారు.
వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ , పశుసంవర్థక, డెయిరీ డెవలప్మెంట్, మత్స్యశాఖామంత్రిగా అచ్చెన్నాయుడు నేడు ఏపీ సచివాలయంలో (Kinjarapu Atchannaidu) బాధ్యతలు స్వీకరించారు.