Home » BRS
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో ఎర్రవల్లి ఫామ్ హౌస్లో మంగళవారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు.
సీఎం రేవంత్ రెడ్డి నడుపుతున్నది ప్రభుత్వమా లేక బుల్డోజర్ కంపెనీనా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. పేద ప్రజల ఇండ్లనిను బుల్డోజర్లతో కూల గొట్టించారని, అభివృద్ధి పేరు చెప్పి తొండలు కూడా గుడ్లు పెట్టని ఎండిన భూములు అంటూ గిరిజన గూడాలపై పడ్డారని విమర్శించారు.
Kishan Reddy : స్థానిక సంస్థల ఎన్నికలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్రెడ్డి అన్నారు. కాంగ్రెస్కు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం చేయాలని .. పోరాటాలకు సిద్ధం కావాలని కిషన్రెడ్డి పిలుపునిచ్చారు.
Harish Rao: దేవాలయ ఉద్యోగులకు ప్రతినెల ఒకటో తేదీన ప్రభుత్వ ఖజానా నుంచి కేసీఆర్ జీతాలు అందించారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు చెప్పారు. ఎమ్మెల్యేగా సిద్దిపేటలో బ్రాహ్మణ పరిషత్ భవనాన్ని, సీఎంగా దేశంలోనే మొట్ట మొదటి సారిగా బ్రాహ్మణ కార్పొరేషన్ను ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ది అని హరీష్రావు చెప్పారు.
Minister Seethakka: కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్పై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. కరప్షన్కు బ్రాండ్ అంబాసిడర్ బీజేపీ ప్రభుత్వమేనని, అంబానీలకు పేదల సంపదను ప్రధాని దోచిపెట్టారని మంత్రి సీతక్క ఆరోపించారు.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచనల వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు దేశద్రోహ వ్యాఖ్యలు చేస్తూ.. దేశ విభజకు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు.
CM Revanth Reddy: ఒక్క సంతకంతో కొడంగల్కు అన్నీ వస్తాయని… మీరు వెళ్లి ఎవరినో అడగాల్సిన పని లేదని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. చిట్టీ రాసిస్తే చాలు తాను కొడంగల్కు వచ్చి అన్నీ సమస్యలు పరిష్కరిస్తానని సీఎం రేవంత్రెడ్డి మాటిచ్చారు.
MLC Kavitha: కాంగ్రెస్ చేసిన కులసర్వే ద్వారా బీసీల జనాభా తగ్గించి.. ఓసీల జనాభాను పెంచారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. గ్రామాల వారీగా కులాల వారీగా ప్రభుత్వం జనాభా లెక్కలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. డెడికేటెడ్ కమిషన్ నివేదికను ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు.
MP Laxman: రేవంత్ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రభుత్వ వ్యతిరేకతను పక్కదోవ పట్టించడానికి డీలిమిటేషన్ అంశాన్ని తెరమీదికి తెచ్చారని మండిపడ్డారు. రుణమాఫీ, ఇచ్చిన హామీలు అమలు చేయడంలో రేవంత్ రెడ్డి విఫలం అయ్యారని విమర్శించారు.
నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. ఎలా చేస్తారో తెలియకుండానే కాంగ్రెస్, బీఆర్ఎ్సలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయని బీజేపీ ఎమ్మెల్యే పాయల్శంకర్ ఆరోపించారు.