KTR: హెచ్సియూ భూముల వెనుక దాస్తున్న నిజం ఏమిటి..
ABN , Publish Date - Apr 01 , 2025 | 10:55 AM
సీఎం రేవంత్ రెడ్డి నడుపుతున్నది ప్రభుత్వమా లేక బుల్డోజర్ కంపెనీనా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. పేద ప్రజల ఇండ్లనిను బుల్డోజర్లతో కూల గొట్టించారని, అభివృద్ధి పేరు చెప్పి తొండలు కూడా గుడ్లు పెట్టని ఎండిన భూములు అంటూ గిరిజన గూడాలపై పడ్డారని విమర్శించారు.

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt.)పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ (BRS working President), మాజీ మంత్రి కేటీఆర్ (Ex Minister KTR) తీవ్రస్థాయిలో విమర్శలు (Comments) గుప్పించారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)ని ఉద్దేశించి మీడియాతో మాట్లాడారు.. మొదట పర్యావరణ పరిరక్షణ పేరు చెప్పి… పేద ప్రజల ఇండ్లను బుల్డోజర్లతో కూల గొట్టించారని, అభివృద్ధి పేరు చెప్పి తొండలు కూడా గుడ్లు పెట్టని ఎండిన భూములు అంటూ గిరిజన గూడాలపై పడ్డారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి నడుపుతున్నది ప్రభుత్వమా లేక బుల్డోజర్ కంపెనీనా అని వ్యాఖ్యానించారు.
Also Read..: హైదరాబాదులో విదేశీయురాలిపై దారుణం..
ఇంకా ‘‘నువ్వు ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధివా లేక రియల్ ఎస్టేట్ ఏజెంట్వా.. విధ్వంసం ఒక్కటే నీ ఎజెండా… ఖజానాకు కాసులు నింపుకోవడమే నీ లక్ష్యం…సెలవు దినాల్లో, అర్ధరాత్రి నీ బుల్డోజర్లు ఎందుకు నడుస్తున్నాయి ముఖ్యమంత్రి... కోర్టులు అంటే ఎందుకు నీకు అంత భయం… హెచ్సీయూ భూముల వెనుక దాస్తున్న నిజం ఏమిటి’’. కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు.
హెచ్సీయూ పోరాటానికి బీఆర్ఎస్ మద్దతు..
కాగా ‘‘రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నపుడు ప్రభుత్వ ఆస్తులు అమ్ముకుంటే భవిష్యత్ తరాలకు స్మశానాలకు కూడా జాగలు ఉండవన్నావు కదా.. మరిప్పుడు ప్రభుత్వ భూములు అమ్ముతూ.. నువ్వు చేస్తున్నదేంటి రేవంత్రెడ్డీ’’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు చేస్తున్న భూ పరిరక్షణ పోరాటానికి బీఆర్ఎస్ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. పలువురు హెచ్సీయూ సోమవారం తెలంగాణ భవన్లో కేటీఆర్ను కలిసి అక్కడి పరిస్థితులను వివరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ భూముల పరిరక్షణకు యూనివర్సిటీ విద్యార్థులు చూపుతున్న తెగువకు సెల్యూట్ చేస్తున్నానన్నారు. హెచ్సీయూలో ఇద్దరు విద్యార్థులను అరెస్టుచేసి జైలుకు పంపినట్లు చెబుతున్నారని, వారి ఆచూకీని ప్రభుత్వం బయటపెట్టాలని డిమాండ్ చేశారు. గతంలో హెచ్సీయూకు రెండు సార్లు వచ్చి వెళ్లిన రాహుల్గాంధీ.. ఇప్పుడు తాజా అంశంపైనా స్పందించాలని కోరారు. బీజేపీతోపాటు ఇతర రాజకీయ పార్టీలు తమ వైఖరిని వెల్లడించాలని డిమాండ్ చేశారు. హెచ్సీయూ మాజీ విద్యార్థులైన భట్టి విక్రమార్క, శ్రీధర్బాబు... ఈ విషయమై ఎందుకు మాట్లాడడం లేదు.. విద్యార్థుల తరఫున నిలబడేందుకు వారి మనసు రావడం లేదా.. అని నిలదీశారు. ఫ్యూచర్ సిటీ, ఫార్మా సిటీల్లో 45,000 ఎకరాలు అందుబాటులో ఉన్నప్పటికీ.. 400 ఎకరాలపై ఎందుకింత దారుణంగా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వందలాది బుల్డోజర్లతో అక్కడున్న చెట్లు, జంతువులను చంపి.. మరీ వేగంగా కబ్జా చేసే ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు. హెచ్సీయూ చుట్టూ ఉన్న పచ్చదనాన్ని కాపాడుకోగలిగితే భవిష్యత్తుకు భరోసా ఉంటుందని.. లేదంటే ఢిల్లీ మాదిరి ఊపిరి పీల్చుకోవడమే కష్టమయ్యే పరిస్థితి ఏర్పడుతుందన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఢిల్లీ బాట పట్టిన అఖిలపక్షం నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో క్రైమ్.. కలకలం రేపిన గ్యాంగ్ వార్
For More AP News and Telugu News