Home » celebrations
కడప: ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం ఉదయం 9 గంటలకు ధ్వజారోహణ కార్యక్రమం జరగనుంది. ఈనెల 11న సీతారాముల కల్యాణోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పట్టువస్త్రాలు, ముత్యాలు సమర్పిస్తారు.
ధర్మబద్ధ జీవనానికి నిలువెత్తు నిర్వచనంగా, మనిషి ఇలా బ్రతకాలి, అని ఒక ఆదర్శవంత మైన జీవితాన్ని గడిపి, మానవ జన్మకున్న విశిష్ఠతను ఆవిష్కరించిన రామాయణ నాయకుడు, ధర్మమూర్తి శ్రీరామచంద్రమూర్తి. రామాయణం అనే మాటలోని ‘అయనం’ అంటే నడక అని అర్థం. రామాయణం అంటే ‘రాముని నడక’ అని అర్థం. అంటే ఆయన జీవించిన విధానం. పరిపూర్ణంగా మానవుడు ఎలా జీవించాలో అలా జీవించి చూపాడు శ్రీరాముడు.
కొత్త సంవత్సరానికి నాంది పలుకుతూ, ఆధ్యాత్మికతను పెంపొందించుకునే పండుగ ఉగాది. ఈ పండుగ రోజు చేసుకునే ఉగాది పచ్చడి షడ్రుచులతో కూడి ఆరోగ్యానికి మేలు చేస్తుందట. షడ్రుచుల కలయిక.. మనలోని భావోద్వేగాలకు ప్రతీక ఈ పచ్చడి. ఉగాది పండగ రోజున ప్రతీ ఒక్కరు ఉగాది పచ్చడిని సేవించడం ఆనవాయితీ. పంచాంగ శ్రవణం ద్వారా గ్రహాల ప్రభావాన్ని అర్థం చేసుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి.
తెలుగుదేశం పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అంటే 1983 జనవరిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో అద్భుతమైన విజయంతో ఎవరూ చెరపలేని రికార్డును సృష్టించింది. ఎన్టీఆర్ నాయకత్వంలో టీడీపీ 294 సీట్లలో 202 గెలుచుకుంది. ఈ విజయం భారత రాజకీయాల్లోనే పెను సంచలనం సృష్టించింది. స్వతంత్ర భారత చరిత్రలో తొలగించిన ముఖ్యమంత్రి తిరిగి సీఎం కావడం ఎన్టీఆర్ ఒక్కరికే సాధ్యమైంది. 1984 ఆగస్టు సంక్షోభంలో పదవిని కోల్పోయిన ఆయన.. తిరిగి నెలరోజులకే సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లిలో శ్రీ సూర్యనారాయణస్వామి జయంతిని పురస్కరించుకుని ఆదివారం ఉదయం రథసప్తమి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. కూటమి ప్రభుత్వం రథసప్తమిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన నేపథ్యంలో ఈ రోజు నుంచి మూడురోజుల పాటు వైభవంగా వేడుకలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
విజయవాడ: నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు విజయవాడ నగర ప్రజలు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో మద్యం అమ్మకాల సమయం ఈరోజు, రేపు రాత్రి ఒంటిగంట వరకు ఎక్సైజ్ శాఖ అధికారులు పొడిగించారు.
75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని సాధారణ పరిపాలనా శాఖ ప్రభుత్వ కార్యదర్శి (రాజకీయ) ఎస్.సురేశ్ కుమార్ అన్ని శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులు, అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. ఈ వేడుకల్లో భాగంగా భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న, బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు, చిత్రపటాలకు పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పిస్తారు.
నవంబర్ 14 నుంచి (బుధవారం) డిసెంబర్ 9 వరకు ప్రజా పాలన విజయోత్సవాలు ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఎల్బి స్టేడియంలో ప్రజా పాలన విజయోత్సవాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. 26 రోజులపాటు ప్రజా పాలన విజయోత్సవాలు జరుగుతాయి.
తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడి ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఘనంగా విజయోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది. అందుకోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో సబ్ కమిటీని ప్రభుత్వం నియమించింది. సచివాలయంలో ఈ కమిటీ సమావేశమై విజయోత్సవ ఉత్సవాలపై చర్చించింది.
మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో విజయదశమి వేడుకలను శని వారం అంగరంగ వైభవంగా వైభవంగా నిర్వహించారు.