Home » Congress Govt
అధికారం చెలాయించేందుకే కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే సంజయ్ కౌంటర్ ఇచ్చారు. తానింకా కాంగ్రెస్ సభ్యత్వం తీసుకోలేదని జీవన్ రెడ్డికి ఎందుకంత అసహనమో అర్థం కావడం లేదని మండిపడ్డారు.
Kishan Reddy: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇచ్చిందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి తెలిపారు. ఉగ్రవాదాన్ని సంపూర్ణంగా నిర్మూలించే దిశగా మోదీ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుందని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ముందడుగు వేసింది. బేస్మెంట్ దశ వరకు నిర్మించిన ఇళ్ల లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందించేందుకు హడ్కో నుంచి రూ.3 వేల కోట్ల రుణం తీసుకోగా, నిర్మాణం కొనసాగించేందుకు ఎస్హెజీల రుణాలు అందిస్తున్నాయి
సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూడ్రోజుల్లోనే 100 ఎకరాల్లో చెట్లు నరికివేయడంపై సుప్రీంకోర్టు సైతం విస్మయం వ్యక్తం చేసినట్లు ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ నియంతృత్వ తీరుకు నిదర్శనమని ఎంపీ మండిపడ్డారు.
KTR: రేవంత్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హెచ్సీయూపై రేవంత్ ప్రభుత్వం అనాలోచితంగా వ్యవహారిస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. విద్యార్థులను కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోందని కేటీఆర్ మండిపడ్డారు.
HCU Land Issue: కంచె గచ్చిబౌలిలో అంతర్జాతీయ సంస్థలు తెచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రయత్నం చేస్తుందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కొంత మంది రాజకీయ కుట్రతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. యూనివర్సిటీలో ఇంచు భూమిని కూడా తాము ముట్టుకోమని స్పష్టం చేశారు.
Ponnam Prabhakar Farmers: రాష్ట్రవ్యాప్తంగా 8 వేల కొనుగోలు కేంద్రాలు ఈరోజు ప్రారంభం చేసుకుంటున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పండించిన వరి ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
Kishan Reddy : స్థానిక సంస్థల ఎన్నికలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్రెడ్డి అన్నారు. కాంగ్రెస్కు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం చేయాలని .. పోరాటాలకు సిద్ధం కావాలని కిషన్రెడ్డి పిలుపునిచ్చారు.
2004లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రైవేటు సంస్థకు ఈ భూమిని కేటాయించిందని, దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులోని కేసుల్లో చట్టపరంగా గెలవడం ద్వారా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆ భూమిపై యాజమాన్యాన్ని దక్కించుకుందని, ఆ భూమికి సంబంధించి సృష్టించే ఎటువంటి వివాదమైనా కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని తెలంగాణ ప్రభుత్వం తేల్చి చెప్పింది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారంలో ఆదివారం నాడు మంత్రి శ్రీధర్ బాబు పర్యటించారు. నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల కమాండ్ కంట్రోల్ రూంను జిల్లా ఎస్పీ కిరణ్ ఖారేతో కలిసి మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు.