Home » Goshamahal
పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న వక్ఫ్బోర్డు బిల్లుకు తెలుగుదేశం, జేడీయూ పార్టీలు ఎలాంటి షరతు లేకుండా మద్దతు ప్రకటించాలని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు. ఆయన మాట్లాడుతూ.. ఇప్పుడు మంచి వాతావరణం వచ్చింది, ప్రధాని మోదీ మంచి నిర్ణయం తీసుకుని 14 మార్పులు కూడా చేశారన్నారు.
గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరో సంచలనానికి తెరలేపారు. బీజేపీలోనే నాకు వెన్నుపోటుదారులు ఉన్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పెనుదుమారానికే దారితీశాయి. బీజేపీలో చాలా మంది తనను ఎప్పుడు వెన్నుపోటు పొడుద్దామా..? అనే ఆలోచన పెట్టుకున్నారని రాజాసింగ్ అనడం గమనార్హం.
తెలంగాణలో అక్రమ చొరబాటుదారులను గుర్తించి కఠినచర్యలు తీసుకోవడానికి ఐపీఎస్ అధికారి ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేయాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్(BJP MLA Raja Singh) ఎక్స్ ట్విటర్లో డిమాండ్ చేశారు.
Goshamahal Nala Collapse: గోషామహల్ చాక్నవాడిలో ఓ నాలా కుప్పకూలింది. దీంతో భారీ గుంత ఏర్పడింది. శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ విషయం తెలియడంతో ప్రజలు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. కుంగిపోయిన నాలాను అధికారులు పరిశీలించారు.
Osmania Hospital: నూతన ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం భూమి పూజ చేశారు. మొత్తం 26 ఎకరాల విస్తీర్ణంలో నూతన ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం జరుగనుంది. 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నూతన ఆసుపత్రిని నిర్మించనున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తెలంగాణ రాష్ట్రం లంచాలకు అడ్డాగా మారిందని గోషామహల్ ఎమ్మెల్యే టి.రాజాసింగ్(Goshamahal MLA T. Rajasingh) విమర్శించారు. ఒకప్పుడు కానిస్టేబుల్, ఎస్ఐ, ఇన్స్పెక్టర్లు లంచాలు తీసుకోవాలంటే భయపడేవారని, కానీ ఇప్పుడు అలా లేదన్నారు.
Telangana: నగరంలో మరోసారి రోడ్డు కుంగుబాటుకు గురైంది. దాదాపు పది అడుగుల లోతులో భారీ ట్రక్కు దిగబడిపోయింది. అయితే ట్రక్కులో ఉన్న లారీ డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డారు. పెను ప్రమాదం తప్పడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.
గోషామహల్ స్టేడియం(Goshamahal Stadium)లో ఉస్మానియా ఆస్పత్రిని నిర్మించొద్దని ఎమ్మెల్యే రాజాసింగ్(MLA Raja Singh) ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి శుక్రవారం లేఖ రాశారు. ‘మీరు గోషామహల్ స్టేడియంలో నిర్మించతలపెట్టిన ఉస్మానియా భవనం ప్రాజెక్టును మరోచోటుకు మార్చాలని కోరుతున్నాను.
Telangana: హైదరాబాద్లో రోడ్లు అకస్మాత్తుగా కుంగిపోతున్నాయి. భూకంపం వచ్చిందా అన్న తీరుగా రోడ్డు కుంగిపోతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
తన నివాసం వద్ద రెక్కీ నిర్వహించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై గోషా మహాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆదివారం హైదరాబాద్లో స్పందించారు. ఈ అంశాన్ని సీరియస్గా తీసుకోవాలని నగర పోలీస్ ఉన్నతాధికారులకు ఆయన సూచించారు. అయినా ఇటువంటి వాటికి తాను భయపడనని రాజా సింగ్ స్పష్టం చేశారు.