Home » Harish Rao
మాజీ మంత్రి హరీశ్రావుపై హైదరాబాద్ బాచుపల్లి పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది. చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ ఉపేందర్ తెలిపారు.
హరీశ్ రావుపై బాచుపల్లి పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. హరీశ్ రావుతో పాటు మరో ముగ్గురి నుంచి తనకు ప్రాణహాని ఉందని కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు బీఎన్ఎస్ 351 (2), ఆర్ డబ్ల్యూ 3 (5) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాల కారణంగానే సాగునీటి ప్రాజెక్టులు దెబ్బతిన్నాయని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. ఈ ఘటనకు ప్రధాన కారణం గత పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సర్కారేనని ధ్వజమెత్తారు.
ఎస్ఎల్బీసీ సొరంగంలో ప్రమాదం జరిగి ఆరు రోజులు గడుస్తున్నా లోపల చికుక్కున్న 8 మందిని కాపాడలేకపోవడంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కన్పిస్తోందని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు.
చక్రధర్గౌడ్ ఫోన్ ట్యాపింగ్ కేసుపై విధించిన స్టేను ఎత్తివేసి, దర్యాప్తునకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఈ కేసులో ఏ-1గా ఉన్న మాజీ మంత్రి హరీశ్రావు కేసు నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారని..
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిని ప్రశ్నించిన వారి మరణాలపై రాజకీయ దుమారం రేగుతోంది. అయితే వీరి మరణాలపై అనుమానాలు ఉన్నాయంటూ స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బుధవారం వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. సీఎం వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
‘‘కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందని ప్రచారం చేసిన కాంగ్రెస్ మూర్ఖుల్లారా.. సిద్దిపేటతోపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గలగల పారుతున్న గోదావరి జలాలను కళ్లు తెరిచి చూడండి’’ అని ఎమ్మెల్యే హరీశ్రావు సూచించారు.
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులెవరూ రుసుములు చెల్లించవద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు పిలుపునిచ్చారు. ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే ఉచితంగా క్రమబద్ధీకరిస్తామని చేస్తామని చెప్పిన కాంగ్రెస్ నేతలు..
మేడిగడ్డ అంశంపై కేసీఆర్ వేసిన పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఈ పిటిషన్పై వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం.. తీర్పును రిజర్వ్ చేసింది. మేడిగడ్డ కుంగిన వ్యవహారంపై..
మాజీ మంత్రి హరీశ్రావు ప్రధాన నిందితుడిగా ఉన్న చక్రధర్గౌడ్ ఫోన్ట్యాపింగ్ (రెండో ఫోన్ట్యాపింగ్ కేసు) కేసు విచారణ ముందుకు జరిగింది. మార్చి మూడో తేదీ బదులు ఈ నెల 27వ తేదీనే వాదనలు జరగనున్నాయి. ఈ మేరకు శుక్రవారం హైకోర్టు నిర్ణయం తీసుకొంది.