Home » Imran Khan
పాకిస్థాన్ ప్రధాన ప్రతిపక్షమైన పాకిస్థాన్ తెహ్రిక్-ఇ-ఇన్సాఫ్ వ్యవస్థాపకుడైన ఇమ్రాన్ఖాన్ 2023 ఆగస్టు నుంచి జైలులో ఉన్నారు. అధికార దుర్వినియోగం, అవినీతి పాల్పడ్డారనే కేసులో గత జనవరిలో ఇమ్రాన్కు 14 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పువెలువడింది.
Imran Khan Pakistan Crisis: పాకిస్తాన్ రాజకీయ అల్లకల్లోలంలో చిక్కుకుంటోంది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైలు గోడల వెనుక నుండి తన గళాన్ని వినిపిస్తూ.. ప్రజాస్వామ్యం ముసుగులో నడుస్తున్న నాటకాన్ని అంతర్జాతీయ సమాజం గమనించాలని కోరుతున్నాడు. ఈ సంక్షోభ సమయంలో ప్రపంచ దేశాలు, ముఖ్యంగా అమెరికా, పాకిస్తాన్ ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చాడు.
అడియాలా జైలులో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ అవినీతి నిరోధక కోర్టుకు చెందిన న్యాయమూర్తి నాసిర్ జావేద్ రానా తీర్పును వెల్లడించారు. వివిధ కారణాల వల్ల తీర్పును గతంలో మూడుసార్లు వాయిదా వేశారు.
పాక్కు సంబంధించిన నిర్ణయాలన్నీ స్వదేశంలోనే తీసుకోవాలన్నదే తన నిశ్చితాభిప్రాయమని ఇమ్రాన్ చెప్పారు. అయితే మానవ హక్కుల విషయాన్నికి వచ్చినప్పుడు సహజంగానే అంతర్జాతీయ సంస్థలు గళం విప్పుతాయని, ఈ లక్ష్యం కోసమే ఐక్యరాజ్యసమితి ఏర్పడిందని చెప్పారు.
పాకిస్థాన్ మాజీ ప్రధాని, పీటీఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై ఆయన మాజీ భార్య జెమీమా గోల్డ్ స్మిత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. జైలులో ఉన్న మాజీ ప్రధాని పట్ల పాకిస్థాన్ వ్యవహరించిన తీరుకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు కోర్టుల్లో ఉపశమనం లభిస్తున్నప్పటికీ, ఆయనకు జైలు కష్టాలు తొలగడం లేదు. కార్ప్స్ కమాండర్ హౌస్పై దాడి, మే 9 అల్లర్లు సహా మొత్తం 12 కేసుల్లో తాజాగా ఆయనను లాహోర్ పోలీసులు అరెస్టు చేశారు.
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్ పార్టీ 'పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్' ను నిషేధించేందుకు ప్రభుత్వం పావులు కదుపుతోంది. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఈ చర్య తీసుకుంటున్నామని ఆ దేశ సమాచార శాఖ మత్రి అత్తావుల్లా తరార్ సోమవారంనాడిక్కడ తెలిపారు.
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దంపతులకు న్యాయస్థానంలో శనివారం ఊరట లభించింది, ఇస్లాం నిబంధనలకు విరుద్ధంగా పెళ్లి చేసుకున్నారంటూ వారిపై ఉన్న అభియోగాలను ఇస్లామాబాద్ డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టు శనివారం తోసిపుచ్చింది.
అక్రమంగా తనను అరెస్టు చేయడమేకాకుండా జైలులో వేధిస్తున్నారని పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేశారు. రాజకీయాల్లో పాల్గొనకుండా ఉండేందుకే తనను అరెస్టు చేశారని తెలిపారు. గురువారం పాక్ సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోని అయిదుగురు సభ్యుల ధర్మాసనం ఆయన కేసుపై విచారణ జరిపింది.
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై నమోదైన పరువు నష్టం కేసులో కోర్టు సంచలన ప్రకటన చేసింది. పాకిస్థాన్ ( Pakistan ) మాజీ చీఫ్ జస్టిస్ ఇఫ్తికార్ ముహమ్మద్ చౌదరి దాఖలు చేసిన 20 బిలియన్ రూపాయల పరువు నష్టం కేసును ఇస్లామాబాద్ జిల్లా సెషన్స్ కోర్టు కొట్టివేసింది.