Home » Karimnagar
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతు లు ఇబ్బందులు పడకుండా అన్ని వసతులు కల్పించాలని అదనపు కలె క్టర్ డి.వేణు ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మంది రంలో అదనపు కలెక్టర్ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తలు సత్తా చాటాలని జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి అశోక్రావు అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్రావు మాట్లా డుతూ గావ్ ఛలో, బస్తీ ఛలో కార్యక్రమాలను విజయ వంతంగా నిర్వహించేందుకు ప్రతీ కార్యకర్త సిద్ధంగా ఉండాలని, అలాగే పలు విషయాలపై చర్చించారు.
క్రికెట్ బాల్ తగిలి ఓ బాలుడు మృతి చెందాడు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం రంగారావుపల్లి గ్రామానికి చెందిన దారం శ్రీనివా్సరెడ్డి వేములవాడలో తన కుటుంబంతో కలిసి జీవిస్తున్నాడు.
బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని ఎస్సీ కమిషన్ జాతీయ సభ్యుడు వడ్డెపల్లి రాంచందర్ అన్నారు. మంగళవారం ఎన్టీపీసీ ఈడీసీ మిలీనియంలో హాలులో పెద్దపల్లి, మంచిర్యాల కలెక్టర్లు కోయ శ్రీహర్ష, కుమార్ దీపక్, అదనపు కలెక్టర్ జె.అ రుణశ్రీ, డీసీపీ భాస్కర్, ఎస్సీ కమిషన్ జాతీయ సలహాదారులు సునీల్ బాబు, రీసెర్చ్ అధికారి డి.వరప్రసాద్తో కలిసి సమీక్ష నిర్వహించారు.
రామగుండం నగరపాలకసంస్థ పరిధి లో వేసవిలో తాగునీటికి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేకాధికారి కోయ శ్రీహర్ష పేర్కొన్నారు. మంగళవారం ఎన్టీపీసీ అనుమతులు, అభివృద్ధి పనులు, వీధిదీపాలు తదితర విషయాలపై ఇంజనీరింగ్, ఎన్పీడీసీఎల్, ఎన్టీపీసీ హెచ్ఆర్ అధికారులతో ఆయన సమీక్ష జరిపారు.
రాష్ట్రంలో బీసీ గణన చేసి 42శాతం విద్య,ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక రంగాల్లో రిజర్వేషన్లకు తీర్మానం చేసిన తెలంగాణ వైపు యావత్ దేశం చూస్తుందని, ఇది కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధని ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ పేర్కొన్నారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పం చాయతీ కార్మికులు ఎదు ర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని మంగళ వారం మండల కేంద్రం లోని ఎంపీడీఓ కార్యాల యం ఎదుట సీఐటీయూ నాయకులు ధర్నా నిర్వ హించారు. సీఐటీయూ జిల్లా నాయకుడు సీపెల్లి రవీందర్ మాట్లాడుతూ జీఓ 51ను సవరించి మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాజీవ్ యువ వికాసం పథకం కింద ఆర్థిక సహాయం పొందేందుకు ఈ నెల 14వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు పొడిగించిన ప్రభుత్వం ఇక నుంచి మీసేవ కేంద్రాల్లోనే కాకుండా ఆఫ్లైన్లో మున్సిపల్, ఎంపీడీవో కార్యాలయాల్లో కూడా నేరుగా దరఖాస్తులు ఇచ్చేందుకు అవకాశం కల్పించింది.
మొక్కజొన్న రైతులకు మద్దతు ధర దక్కడం లేదు. ప్రభుత్వం సకాలంలో కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడంతో చేతికి వచ్చిన పంటను దళారులకు అమ్ముకోవాల్సి వస్తోంది. వరదలతో వానాకాలంలో చాలా మంది మొక్కజొన్న రైతులు నష్టపోయారు. కొన్ని చోట్ల రైతులకు పెట్టుబడి కూడా దక్కలేదు.
చిన్నారుల నుంచి పెద్దపిల్లల వరకు అద్దాలతోని పాఠశాలలు, కాలేజీలకు పరుగులు తీస్తూ కనిపిస్తున్నారు. ఏ తరగతి గదికి వెళ్లినా కొందరు పిల్లలైనా అద్దాలతో కనిపిస్తారు. సర్వేంద్రియాల్లో కళ్లు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. చూపు లేకపోతే మనిషి నిర్వీర్యంగా మారిపోయే ప్రమాదం ఉంది.