Home » Manipur
మహిళలను అవమానించే సంఘటనలు తరచూ జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మణిపూర్లో వివిధ వర్గాల మధ్య ఘర్షణల నేపథ్యంలో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన దారుణం బయటపడిన కొద్ది రోజులకు పశ్చిమ బెంగాల్లో అటువంటి దుశ్చర్య బయటపడింది. దొంగతనానికి పాల్పడ్డారనే నెపంతో ఇద్దరు మహిళలను అర్ధనగ్నంగా చేసి, కొందరు మహిళా వ్యాపారులు కొట్టినట్లు తెలుస్తోంది.
మణిపూర్లో మరో దారుణం. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, వారిపై అత్యాచారానికి పాల్పడిన ఉదంతం దుమారం రేపుతుండగానే.. ఓ యువకుడి తల నరికి వెదురు తడికెకు వేలాడదీసిన ఘటన వెలుగులోకి వచ్చింది. హతుడు కుకీ తెగకు
మణిపూర్లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన పార్లమెంటును సైతం కుదిపేయడంతో శాంతి భద్రతల వైఫల్యానికి బాధ్యత వహిస్తూ సీఎం ఎన్.బైరేన్ సింగ్ రాజీనామా చేయాలనే డిమాండ్లు మరోసారి ఊపందుకున్నాయి. అయితే, రాష్ట్రంలో శాంతిభద్రతలు పునరుద్ధరించడమే తన పని అని, బాధ్యులైన వారిపై కఠిన చర్చలు తీసుకుంటామని సీఎం చెప్పారు.
మణిపూర్లో సభ్యసమాజం తల వంచుకునేలా ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరించిన ఘటనపై నిరసనలు పెల్లుబుకుతుండగా, ఈ ఘటనపై ప్రధానమంత్రి మోదీని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ నిలదీశారు. ఈ ఘటన మీ హృదయాన్ని కొంచెమైనా బాధించలేదా అని ప్రశ్నించారు.
పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో రెండో రోజు కూడా మణిపూర్ పరిస్థితిపై ప్రతిపక్షాల నినాదాలతో దద్దరిల్లింది. మణిపూర్లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనతోపాటు, మే 3 నుంచి కొనసాగుతున్న హింసాకాండ గురించి చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి.
మణిపూర్లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనకు కారణం వదంతులేనని మణిపూర్ పోలీసు వర్గాలు తెలిపాయి.
పట్టపగలు కుకీ తెగకు చెందిన ముగ్గురు గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించి, సామూహిక అత్యాచారానికి పాల్పడిన అమానుష ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బిరెన్ సింగ్ (Biren singh) స్పందించారు. అవనుషమైన ఈ ఘటనతో సంబంధమున్న మరో వ్యక్తిని పోలీసులు సాయంత్రం అరెస్ట్ చేశామని ప్రకటించారు. వీడియో చూసిన తర్వాత ఈ హేయమైన నేరాన్ని ఖండించాలని నిర్ణయించామని అన్నారు. మానవత్వంపై జరిగిన నేరంగా అభివర్ణించారు.
మణిపూర్లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి గ్యాంగ్ రేప్ చేసిన ఘటనపై దేశవ్యాప్తంగా విమర్శల వర్షం కురుస్తోంది. ఈ అంశంపై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా స్పందించారు. ఈ ఘటన తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని సోషల్ మీడియా ద్వారా ఆవేదన చెందారు. ఈ మేరకు ఆమె ఓ నోట్ను పోస్ట్ చేశారు.
పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలి రోజైన గురువారం మణిపూర్ హింసాకాండ, అమానవీయ ఘటనలపై నిరసనలతో ఉభయ సభలు దద్దరిల్లాయి. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించినట్లు కనిపిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవడంతో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.
రెండున్నర నెలల నుంచి హింసాత్మక సంఘటనలు జరుగుతున్న మణిపూర్లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన దారుణ సంఘటనపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర ఆవేదన, బాధ వ్యక్తం చేశారు. ఈ సంఘటనలో ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్ ప్రకటించారు.