Home » Manipur
రెండు వర్గాల మధ్య వైరంతో కుతకుతలాడుతున్న మణిపూర్లో శాంతి చర్యలకు మళ్లీ విఘాతం కలిగింది. మణిపూర్లోని ఈస్ట్ ఇంఫాల్లోని ఖమెన్లాక్ ప్రాంతంలో తిరిగి హింసాకాండ చెలరేగింది. మంగళవారం రాత్రి చోటుచేసుకున్న కాల్పుల్లో ఒక మహిళతో సహా 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మంది గాయపడ్డారు.
మణిపూర్లో గత నెల నుంచి ఘర్షణలు జరుగుతుండటానికి కారణం బీజేపీ/ఆరెస్సెస్ రాజకీయాలేనని కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ ఆరోపించారు.
హింసాత్మక సంఘటనలతో అట్టుడుకుతున్న మణిపూర్లో తిరుగుబాటుదారులు మళ్లీ రెచ్చిపోయారు. సోమ-మంగళవారాల మధ్య రాత్రి జరిగిన ఎన్కౌంటర్లో బీఎస్ఎఫ్
అల్లర్లు, హింసాకాండంతో అట్టుడికిన మణిపూర్లో శాంతిని పాదుకొలుపుదామని కేంద్ర హోం మంత్రి అమిత్షా ఆ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. మణిపూర్లో తాజా పరిస్థితిని సమీక్షించిన అనంతరం ఆయన వరుస ట్వీట్లలో రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు ప్రజలందరూ కలిసిరావాలని కోరారు.
మణిపూర్లో జరిగిన విస్తృత హింసాకాండపై విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ఓ కమిటీ చేత దర్యాప్తు చేయిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా గురువారం ప్రకటించారు.
అల్లర్లు, హింసాకాండతో అట్టుడికిన మణిపూర్లో శాంతిని పునరుద్ధరించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్షా తెలిపారు. పరిస్థితిని సమీక్షించేందుకు పౌర సంస్థలు, మహిళా నేతల బృందంతో మంగళవారంనాడు ఆయన సమావేశమయ్యారు.
మణిపూర్ లో ఇటీవల తలెత్తిన భారీ హింసాకాండ ఇప్పడిప్పుడే తగ్గుపడుతున్న సమయంలో సోమవారంనాడు మళ్లీ తాజా ఘర్షణలు తలెత్తాయి. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితిలు నెలకొన్నాయి. ఇంఫాల్లోని న్యూ చెకాన్ ఏరియాలో మైతీ, కుకీ వర్గాలు బాహాబాహీకి దిగాయి. రెచ్చిపోయిన అల్లరిమూక లాంబులేన్ ప్రాంతంలో ఇళ్లకు నిప్పుపెట్టింది. దీంతో ఆర్మీ రంగంలోకి దిగింది.
న్యూఢిల్లీ: మణిపూర్ లో ఇటీవల పెద్దఎత్తున చెలరేగిన హింసాకాండకు కారణాలు, ప్రస్తుత పరిస్థితిని అంచనా వేసేందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ముగ్గురు సభ్యుల నిజనిర్ధారణ బృందాన్ని బుధవారంనాడు ఏర్పాటు చేశారు. ఈ బృందంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఎంపీ ముకుల్ వాస్నిక్, మాజీ ఎంపీ అజాయ్ కుమార్, పార్టీ ఎమ్మెల్యే సుదీప్ రాయ్ బర్మన్ సభ్యులుగా ఉన్నారు.
హింసాకాండతో అట్టుడుకుతున్న మణిపూర్ నుంచి జనం ఇతర సురక్షిత ప్రాంతాలకు వలస పోతున్నారు....
న్యూఢిల్లీ: మణిపూర్ (Manipur)లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులను (Telangana Students) తీసుకువచ్చేందుకు తెలంగాణ భవన్ అధికారులు ఏర్పాట్లు చేశారు.