Home » Medigadda Barrage
మేడిగడ్డ బ్యారేజీలో కుంగుబాటుకు గురైన బ్లాక్-7కు దిగువన షీట్ఫైల్స్ ఏర్పాటు చేసేందుకు పనులు ప్రారంభమయ్యాయి. ఇందుకోసం బ్లాక్-7కు దిగువన ఉన్న ఒక వరుస సీసీ బ్లాక్లను తొలగించడంతో పాటు వరద ఉధృతికి చెల్లాచెదురైన సీసీ బ్లాక్లను తిరిగి అమరుస్తున్నారు.
మేడిగడ్డ ప్రాజెక్టు ఏడో బ్లాక్ పునాదుల కింద అగాధం ఏర్పడిన నేపథ్యంలో వాటిని పూడ్చి పునాదులను పటిష్టం చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు జరుగుతున్నాయి. వర్షాలు పడి, మేడిగడ్డ వద్ద ప్రవాహం మొదలు కావడానికి కేవలం 2వారాల సమయం మాత్రమే ఉంది.
మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాకు పిల్లర్ నెం.20 వద్ద బ్యారేజీ లోపలి భాగంలో నలుగురు మనుషులు పట్టేంత పెద్ద గొయ్యి పడింది. ఇది మేడిగడ్డ కింద ఏర్పడిన అగాధంలో భాగమని భావిస్తున్నారు. గురువారం సాయంత్రం 16వ నంబరు గేటు ఎత్తే ప్రయత్నంలో భారీ శబ్దాలు వచ్చిన తర్వాత బ్యారేజీలో జలాశయం వైపు ఇసుక కుంగి, ఈ గొయ్యి కనిపించింది.
మేడిగడ్డ బ్యారేజీకి ఎగువన గోదావరి వరదను మళ్లించడానికి జియో ట్యూబ్ సాంకేతికతతో నిర్మించ తలపెట్టిన కట్టపై చీఫ్ ఇంజనీర్ల(బీవోసీఈ) బోర్డు సమావేశం చర్చించింది. నీటిపారుదలశాఖలోని బీవోసీఈ హాలులో ఈ సమావేశం శుక్రవారం జరిగింది.
మేడిగడ్డ మరమ్మతులకు మరో గండం వచ్చి పడింది. మొత్తం బ్యారేజీ కింద పెద్ద అగాధం ఉన్నట్లుగా నీటిపారుదల శాఖ అధికారులు తేల్చారు. మేడిగడ్డ బ్యారేజీలో పెద్ద ఎత్తున నీటిని నిల్వ చేయడం వల్ల ఆ ఒత్తిడితో బ్యారేజీ కింద నుంచి ఇసుక పెద్ద మొత్తంలో కొట్టుకుపోవడం వల్ల బ్యారేజీ అడుగున పెద్ద అగాధం ఏర్పడిందని అంచనాకు వచ్చారు.
వానాకాలంలోపు ఒకసారి, వానాకాలం పూర్తయ్యాక మరోసారి రాష్ట్రంలోని ఆనకట్టలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించాలని ఆయా డ్యామ్ల చీఫ్ ఇంజనీర్లకు రాష్ట్ర ఆనకట్టల భద్రతా సంస్థ (స్టేట్ డ్యామ్సేఫ్టీ ఆర్గనైజేషన్-ఎ్సడీఎ్సవో) ఆదేశించింది.
మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల వద్ద జరుగుతున్న మరమ్మతు పనులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరిశీలించనున్నారని, ఈ మేరకు సీఎం నాలుగైదు రోజుల్లో క్షేత్రస్థాయిలో పర్యటిస్తారని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల వద్ద జరుగుతున్న పనుల పురోగతిపై మంత్రి సమీక్షించారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ లక్ష్మి బ్యారేజీ, అన్నారం సరస్వతి బ్యారేజీలను పుణేకు చెందిన కేంద్ర జల, విద్యుత్ పరిశోధన సంస్థ(సీడబ్ల్యూపీఆర్ఎస్) నిపుణులు బుధవారం పరిశీలించారు. ఆ సంస్థలోని భూభౌతిక, భూసాంకేతిక, నాన్ డిస్ట్రక్టివ్ విభాగాలకు చెందిన ముగ్గురు నిపుణులు..
ప్రాణహితకు వర్షాకాలం వచ్చే వరద తగ్గుముఖం పట్టాక మేడిగడ్డ బ్యారేజీకి ఎగువన తాత్కాలికంగా రాతికట్ట కట్టి, నదీ ప్రవాహాన్ని లక్ష్మీ పంప్హౌ్సకు మళ్లించి, అన్నారం బ్యారేజీలోకి ఎత్తిపోయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. మేడిగడ్డ బ్యారేజీ వద్ద ప్రస్తుతం నీటిని నిల్వ చేసే అవకాశం లేనందున ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఎన్నికల సంఘం షరతుల మేరకు నిర్వహించిన తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సమక్షంలో జరిగిన ఈ భేటీలో సుమారు 4 గంటలపాటు కీలక అంశాలపై మంత్రులు చర్చించారు. కాళేశ్వరం బ్యారేజీలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది.